7,378
కిలోల
నిర్వీర్యానికి
సిద్ధంగా ఉంచిన గంజాయి
●సాధారణంగా గంజాయి నిర్వీర్యం అంటే చాలా చోట్ల కాల్చివేస్తారు.
● కానీ పాతకుంకాం రెయిన్బో ఇండస్ట్రీలో మాత్రం పోలీసులు శాసీ్త్రయ పద్ధతిలో గంజాయిని నిర్వీర్యం చేశారు.
● ఈ పరిశ్రమలో ఈ ప్రక్రియ నిర్వహించడం ఇదే మొదటిసారి.
● ఇక్కడ బయో మెడికల్ వ్యర్థాలు నిర్వీర్యం చేస్తారు.
● గంజాయిని తగల బెట్టటం, గోతుల్లో వేసి పూడ్చటం వల్ల కాలుష్య సమస్యలు రావచ్చు.
● అందుకే ఈ పరిశ్రమను ఎంచుకున్నారు. ఇక్కడ పొగ కూడా బయటకు రాకుండా ఏకంగా 16 గంటల పాటు గంజాయిని నిర్వీర్యం చేసే ప్రక్రియ కొనసాగుతుంది.
● కాలుష్య రహిత నిర్వీర్య ప్రక్రియ వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలుగదని పోలీసులు వివరించారు.
ఎచ్చెర్ల క్యాంపస్: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం (మన్యం) జిల్లాల్లో 2024 నుంచి ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న 7378 కిలోల గంజాయిని గురువారం పోలీసులు నిర్వీర్యం చేశారు. లావేరు మండలం పాతకుంకాంలో ఉన్న రెయిన్బో పరిశ్రమలో ఈ ప్రక్రియ చేపట్టారు. విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లా ఎస్పీలు కేవీ మహేశ్వరరెడ్డి, వకుల్ జిందాల్, ఎస్వీ మాధవ్ రెడ్డి పర్యవేక్షించారు. మూడు జిల్లాల నుంచి గంజాయిని ఇక్కడకు వాహనాల్లో తీసుకువచ్చి తూకం వేసి.. శాసీ్త్రయ పద్ధతిలో నిర్వీర్యం చేశారు. మొత్తం మూడు జిల్లాల్లో 226 కేసుల్లో ఈ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి నియంత్రణపై ప్రత్యేక నిఘా:
డీఐజీ గోపీనాథ్ జెట్టి
రాష్ట్రంలోని పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలు మేర కు రాష్ట్రంలో గంజాయిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి చెప్పారు. పాతకుంకాంలో గంజాయి నిర్వీర్య కార్యక్రమంలో భాగంగా మీడియాతో ఆయన గురువారం మాట్లాడారు. 2025లో మూడు దశల్లో స్వాధీనం చేసుకున్న గంజాయిని నిర్వీర్యం చేశామన్నారు. మొదటి దశలో అనకాపల్లిలో జనవరిలో 3449 కిలోల గంజాయి, 39.04 లీటర్ల హాషిష్ అయిల్, రెండో దశలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3075 కిలోల గంజాయి, 25.05 లీటర్ల హాషిష్ ఆయిల్, మూడో దశలో ప్రస్తుతం పాత కుంకాంలో 7378 కిలోల గంజాయిని నిర్వీర్యం చేశామన్నారు. గంజాయి నియంత్రణపై పూర్తిస్థాయిలో దృష్టిపెడుతున్నట్లు చెప్పారు. ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయి అక్రమంగా సరఫరా అవుతోందని గుర్తించామన్నారు.
ఆపరేషన్ గంజా ఇలా..
ఎందుకు కాల్చలేదంటే..?
గంజాయి నిర్వీర్యం