దర్గా కట్ట వద్ద యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

దర్గా కట్ట వద్ద యువకుడి మృతి

May 29 2026 5:47 AM | Updated on May 29 2026 5:47 AM

యాడికి: మండల కేంద్రంలోని దర్గా కట్టపై కూర్చొన్న ఓ యువకుడు ఉన్నఫళంగా కిందపడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం గొర్విమానుపల్లికి చెందిన మద్దిలేటి కుమారుడు సుధాకర్‌(34)కు యాడికి మండలం కమలపాడుకు చెందిన యువతితో వివాహమైంది. ఈ క్రమంలో కమలపాడుకు వచ్చిన సుధాకర్‌ గురువారం యాడికి గ్రామానికి వచ్చాడు. సాయంత్రం కమలపాడు మార్గంలోని దర్గా వద్దకు చేరుకుని కట్టపై కూర్చొన్న అతను ఉన్నఫళంగా కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడు చేరుకుని పరిశీలించారు. మృతుడి తండ్రి మద్దిలేటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, సుధాకర్‌ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement