కళ్యాణదుర్గంలో పలువురి ఫోన్ల హ్యాక్‌ | - | Sakshi
Sakshi News home page

కళ్యాణదుర్గంలో పలువురి ఫోన్ల హ్యాక్‌

May 25 2026 10:03 AM | Updated on May 25 2026 10:03 AM

కళ్యాణదుర్గం రూరల్‌: పట్టణ పరిధిలో పలువురికి చెందిన ఫోన్లు ఆదివారం హ్యాక్‌కు గురయ్యాయి. మున్సిపాలిటీ పరిధిలోని ఒంటిమిద్ది, దేవాదులకొండ గ్రామాలకు చెందిన పలువురి ఫోన్ల నుంచి ‘తాను ఆస్పత్రిలో ఉన్నానని, ఫోన్‌పే ద్వారా డబ్బు పంపండి’ అంటూ స్నేహితులకు, బంధువులకు వాట్సాప్‌ ద్వారా మెసేజ్‌లు వెళ్లాయి. వెంటనే సదరు వ్యక్తులు ఫోన్‌ చేసి నిజమా అని కనుక్కోవడంతో అలాంటిదేమీ లేదని, తమకు తెలియకుండానే తమ ఫోన్‌ నుంచి మెసేజ్‌లు వెళ్తున్నాయని చెప్పడంతో హ్యాక్‌ విషయం బయటకు వచ్చింది. ఆందోళన చెందిన కొందరు వెంటనే తమ ఖాతాలో ఉన్న నగదును మరో ఖాతాకు జమచేశారు. అయితే హ్యక్‌ అయిన ఫోన్‌ల్లో నగదు పోయినట్లు ఎవరూ చెప్పలేదు. దీనిపై క్రైంబ్యాచ్‌ పోలీసులకు పలువురు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై పట్టణ పోలీసులను ‘సాక్షి’ వివరణ కోరగా... నగదు పోయినట్లు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, అయితే సెల్‌ఫోన్‌లో అనవసరమైన లింక్‌లు, ఫైళ్లు ఓపెన్‌ చేయొద్దని ప్రజలకు సూచించారు.

డబ్బు పంపాలని బంధువులు, స్నేహితులకు మెసేజ్‌లు

Advertisement
 
Advertisement
Advertisement