రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక బీమా పథకం అమలు కావడం లేదు. ఖరీఫ్, రబీ ఏ సీజన్లో పంట నష్టపోయినా బీమా మాత్రం చేదికందలేదు. దీంతో బీమా పథకంపై ఆశలు వదిలేసుకున్నాం. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు పంటల బీమా అమలు చేసి రైతులను కష్టకాలంలో ఆదుకున్నారు. ప్రస్తుత చంద్రబాబు సర్కార్ రైతుల గురించి పట్టించుకోకపోవడం విచారకరం. ఈ ఏడాది భూగర్భజలాలు తగ్గిపోవడంతో చీనీ తోటలను బతికించుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహమూ లేదు. కనీసం సబ్సిడీ కింద వ్యవసాయ పరికరాలు తీసుకుందామన్నా ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
– బోయ గోపాల్, చీనీ రైతు, మర్తాడు, గార్లదిన్నె మండలం


