విద్యుదాఘాతంతో రైతు మృతి
యల్లనూరు: విద్యుత్ షాక్కు గురై ఓ రైతు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. యల్లనూరు మండలం తిమ్మంపల్లికి చెందిన పత్తికొండ పెద్దన్న (72)కు భార్య చంద్రమ్మ, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. తమకున్న పొలంలో పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వరి పంటకు నీరు పెట్టేందుకు బుధవారం ఉదయం భార్యతో కలసి పెద్దన్న పొలానికి వెళ్లాడు. స్తంభంపై ఉన్న లైనుకు మోటార్ వైర్లను తగిలించే క్రమంలో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ రామాంజనేయరెడ్డి తెలిపారు.


