భర్త చేతిలో భార్య హతం | - | Sakshi
Sakshi News home page

భర్త చేతిలో భార్య హతం

Sep 7 2025 7:08 AM | Updated on Sep 7 2025 7:08 AM

భర్త చేతిలో భార్య హతం

భర్త చేతిలో భార్య హతం

అనుమానంతోనే ఘాతుకం

గాండ్లపెంట: భర్త చేతిలో భార్య హత్యకు గురైంది. అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. తూపల్లికి చెందిన కుటాగుళ్ల మన్సూర్‌ కదిరిలోని ఓ చికెన్‌ సెంటర్‌లో పని చేస్తున్నాడు. భార్య కుటాగుళ్ల మెహతాజ్‌ (28) శుక్రవారం ఇంట్లో చెప్పకుండా మదనపల్లికి వెళ్లింది. భార్య ప్రవర్తనపై భర్తకు అనుమానం వచ్చింది. తనకు చెప్పకుండా ఎందుకు ఊరికి వెళ్లావంటూ అదే రోజు రాత్రి భార్యతో మన్సూర్‌ గొడవపడ్డాడు. ఈ క్రమంలో రోకలిబండ తీసుకుని భార్య తలపై బలంగా కొట్టాడు. దీంతో మెహతాజ్‌ అక్కడికక్కడే మృతి చెందింది. ఇదంతా పన్నెండేళ్ల కుమారుడి ఎదుటే జరిగింది. శనివారం కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కదిరి రూరల్‌ సీఐ నాగేంద్రప్రసాద్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement