● గరుడ వాహనంపై ఖాద్రీశుడు | - | Sakshi
Sakshi News home page

● గరుడ వాహనంపై ఖాద్రీశుడు

Mar 19 2025 1:50 AM | Updated on Mar 19 2025 1:48 AM

కదిరి: కాటమరాయుడి బ్రహ్మోత్సవాలు కమనీయంగా సాగుతున్నాయి. పదో రోజైన మంగళవారం రాత్రి ఖాద్రీశుడు మరోసారి గరుడా రూఢుడై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. మోహినీ ఉత్సవంలో ముందు రోజు తిరువీధుల్లో ఊరేగిన శ్రీవారు సాయంత్రానికి తిరిగి ఆలయం చేరుకున్నారు. నిత్యపూజలు, గ్రామోత్సవం అనంతరం రాత్రి సమయంలో గరుడవాహనంపై ఆలయ ప్రాంగణంలో కొలువుదీరారు. విశేషాలంకరణ ముగిసిన వెంటనే స్వామి వారికి ప్రధాన అర్చకులు దివ్య మంగళ హారతినిచ్చారు. అప్పటికే రాజగోపురం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న భక్తులు తమ ఇలవేల్పును దర్శించుకుని తరించారు. తర్వాత స్వామి వారు తిరువీధుల్లో విహరించారు. ఉత్సవాలకు అధిపతి అయిన బ్రహ్మ ప్రజల కోరిక మేరకు తన ఇష్ట వాహనమైన గరుత్మంతుడిని నారసింహునికి వాహనంగా పంపుతారు. దీన్నే ప్రజా గరుడసేవ..మలి గరుడసేవ అని కూడా అంటారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.

గిరి ప్రదక్షిణ

గతంలో ఎన్నడూ లేని విధంగా మంగళవారం లక్ష్మీ నారసింహుని జన్మనక్షత్రాన్ని పురస్కరించుకొని పట్టణానికి చెందిన భక్తులు ఉదయాన్నే కదిరి కొండకు చేరుకొని గిరి ప్రదక్షణ చేశారు. కాగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బుధవారం రాత్రి తెల్లటి ఐరావతంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

● గరుడ వాహనంపై ఖాద్రీశుడు 1
1/1

● గరుడ వాహనంపై ఖాద్రీశుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement