గేదెను ఢీకొట్టిన మోటార్‌బైక్‌ | - | Sakshi
Sakshi News home page

గేదెను ఢీకొట్టిన మోటార్‌బైక్‌

Sep 3 2025 4:37 AM | Updated on Sep 3 2025 4:41 AM

వ్యక్తి మృతి

ఉదయగిరి: మండలంలోని సర్వరాబాదు సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. మసాయిపేటకు చెందిన పిడుగు మస్తాన్‌బాబు (30) మోటార్‌బైక్‌పై సీతారామపురం మండలానికి వెళ్లాడు. పని ముగిశాక తిరిగి సొంతూరికి బయలుదేరాడు. ఈ క్రమంలో సర్వరాబాదు సమీపంలో బైక్‌ గేదెను ఢీకొట్టింది. మస్తాన్‌బాబు కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే గేదె కూడా చనిపోయింది. సమాచారం అందుకున్న ఎస్సై ఇంద్రసేనారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement