తల్లికి వందనం పడలేదయ్యా ! | - | Sakshi
Sakshi News home page

తల్లికి వందనం పడలేదయ్యా !

Jul 26 2025 8:58 AM | Updated on Jul 26 2025 8:58 AM

తల్లికి వందనం పడలేదయ్యా !

తల్లికి వందనం పడలేదయ్యా !

ఉలవపాడు: తల్లికి వందనం పడలేదయ్యా.. అంటూ మహిళలు రాష్ట్ర గృహనిర్మాణ, సమాచారం పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథికి ఏకరువు పెట్టారు. శుక్రవారం మండలంలోని భీమవరంలో సుపరిపాలన – తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తల్లికి వందనం పడలేదని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన పలువురు మహిళలు మంత్రిని అడిగారు. సాంకేతిక సమస్యలను సరిచేసి అందరికి ఇస్తామని తెలిపారు. రేషన్‌ కార్డులు కావాలని, అంబేడ్కర్‌నగర్‌లోని పాఠశాలను బాగు చేయాలని, సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ త్వరలో అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు హామీలు అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తోపాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement