
నెల్లూరు సిటీ: కారు ఢీకొనడంతో యువకుడు మృతి చెందిన ఘటన నారాయణరెడ్డిపేట వద్ద ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. తోటపల్లిగూడూరు మండలం ఈదూరుకు చెందిన మోచర్ల శరత్ (35) జేసీబీ ఆపరేటర్గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఇందుకూరుపేట నుంచి నెల్లూరు వైపు వస్తుండగా, నారాయణరెడ్డిపేట వద్ద గుర్తుతెలియని కారు ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలను సేకరించారు. బైక్ను ఢీకొన్న కారు వివరాల కోసం మార్గంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. రూరల్ సీఐ వేణు దర్యాప్తు చేస్తున్నారు.