సీఎస్‌కేపై రాజస్తాన్‌ సవారీ | Rajasthan Beat CSK By 7 Wickets | Sakshi
Sakshi News home page

సీఎస్‌కేపై రాజస్తాన్‌ సవారీ

Oct 19 2020 10:55 PM | Updated on Oct 19 2020 10:59 PM

Rajasthan Beat CSK By 7 Wickets - Sakshi

అబుదాబి:  ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సీఎస్‌కేపై మరోసారి రాజస్తాన్‌ రాయల్స్‌దే పైచేయి అయ్యింది. ఇరు జట్ల మధ్య జరిగిన ఫస్ట్‌ లెగ్‌ మ్యాచ్‌లో రాజస్తాన్‌ 16 పరుగుల తేడాతో విజయం సాధించగా, తాజాగా జరిగిన మ్యాచ్‌లో స్మిత్‌ గ్యాండ్‌ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. సీఎస్‌కే నిర్దేశించిన 126 పరుగుల టార్గెట్‌ను రాజస్తాన్‌ 17.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును జోస్‌ బట్లర్‌, స్టీవ్‌ స్మిత్‌లు ఆదుకున్నారు. ఈ జోడి మరొక వికెట్‌ పడకుండా జాగ్రత్త పడి జయకేతనం ఎగురవేసింది.  జోస్‌ బట్లర్‌(70 నాటౌట్‌; 48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు ‌), స్టీవ్‌ స్మిత్‌ (26నాటౌట్‌; 34 బంతుల్లో 2 ఫోర్లు)లు రాణించి జట్టును విజయపథంలో నడిపించారు. అంతకముందు బెన్‌ స్టోక్స్‌(19; 11 బంతుల్లో 3 ఫోర్లు), రాబిన్‌ ఊతప్ప(4), సంజూ శాంసన్‌ డకౌట్‌ అయ్యాడు. సీఎస్‌కే బౌలర్లలో దీపక్‌  చాహర్‌ రెండు వికెట్లు సాధించగా, హజిల్‌వుడ్‌ వికెట్‌ తీశాడు. (ఎంఎస్‌ ధోని నయా చరిత్ర.. రైనా కంగ్రాట్స్‌)

ముందుగా బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే 126 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సీఎస్‌కే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో మోస్తరు స్కోరును మాత్రమే బోర్డుపై ఉంచింది. డుప్లెసిస్‌(10), వాట్సన్‌(8), అంబటి రాయుడు((13)లు తీవ్రంగా నిరాశపరచగా, సామ్‌ కరాన్‌(22) ఫర్వాలేదనిపించాడు.  ఇక రవీంద్ర జడేజా(35 నాటౌట్‌; 30 బంతుల్లో 4 ఫోర్లు), ధోని(28; 28 బంతుల్లో 2 ఫోర్లు)లు మరమ్మత్తులు చేయడంతో 120 పరుగు మార్కును చేరింది. 56 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో ధోని-జడేజాలు ఇన్నింగ్స్‌ చక్కదిద్దే యత్నం చేశారు. ఎక్కువగా స్టైక్‌రొటేట్‌ చేస్తూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. కాగా, కార్తీక్‌ త్యాగి వేసిన 14వ ఓవర్‌లో వీరిద్దరూ మూడు బౌండరీల సాయంతో 14 పరుగులు సాధించడం మినహా పెద్దగా మెరుపులు రాలేదు. కాగా, ఈ జోడి 51 పరుగులు జత చేసిన తర్వాత ధోని రనౌట్‌ అయ్యాడు. రాజస్తాన్‌ బౌలర్లలో ఆర్చర్‌, కార్తీక్‌ త్యాగి, శ్రేయస్‌ గోపాల్‌, రాహుల్‌ తెవాటియాలు తలో వికెట్‌ తీశారు.

ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ బౌలింగ్‌లో దుమ్మురేపింది. ప్రధానంగా జోఫ్రా ఆర్చర్‌తో పాటు శ్రేయస్‌ గోపాల్‌, రాహుల్‌ తెవాటియా అద్భుతమైన స్పెల్‌లతో అదరగొట్టారు. ఆర్చర్‌ తన నాలుగు ఓవర్ల కోటాలో 20  పరుగులే ఇచ్చి వికెట్‌ తీయగా, గోపాల్‌ నాలుగు ఓవర్లలో వికెట్‌ సాధించి 14 పరుగులు ఇచ్చాడు. తెవాటియా 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి వికెట్‌ తీశాడు. వీరు ముగ్గురూ 12 ఓవర్లలో 52 పరుగులే ఇచ్చారు. దాంతో సీఎస్‌కే రన్‌రేట్‌ దారుణంగా పడిపోయింది.  చివరి పది ఓవర్లలో సీఎస్‌కే 69 పరుగులే చేసి వికెట్‌ను కోల్పోయింది. తొలి పది ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసి నాలుగు వికెట్లను సీఎస్‌కే కోల్పోయింది. సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. ఈ ఐపీఎల్‌ ఇదే అత్యల్ప స్కోరుగా నమోదైంది.(రోహిత్‌ దూరమైతే.. కెప్టెన్‌గా ఎవరు?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement