హైదరాబాద్‌ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా తిలక్‌ వర్మ | Hyderabad team selected for Ranji trophy 2024-25 | Sakshi
Sakshi News home page

Ranji trophy 2024-25: హైదరాబాద్‌ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా తిలక్‌ వర్మ

Oct 2 2024 12:53 PM | Updated on Oct 2 2024 1:27 PM

Hyderabad team selected for Ranji trophy 2024-25

దేశవాళీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ టోర్నీ రంజీ ట్రోఫీలోని తొలి రెండు మ్యాచ్‌ల్లో పాల్గొనే హైదరాబాద్‌ జట్టును ప్రకటించారు. భారత యువ క్రికెటర్‌ ఠాకూర్‌ తిలక్‌ వర్మ హైదరాబాద్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. వైస్‌ కెపె్టన్‌గా రాహుల్‌ సింగ్‌ను నియమించారు. 

గ్రూప్‌ ‘బి’లో ఉన్న హైదరాబాద్‌ జట్టు తమ తొలి మ్యాచ్‌ను హైదరాబాద్‌లో అక్టోబర్‌ 11 నుంచి గుజరాత్‌ జట్టుతో... రెండో మ్యాచ్‌ను డెహ్రాడూన్‌లో అక్టోబర్‌ 18 నుంచి ఉత్తరాఖండ్‌తో ఆడుతుంది.  

హైదరాబాద్‌ రంజీ జట్టు: తిలక్‌ వర్మ(కెప్టెన్‌ ), రాహుల్‌ సింగ్‌ (వైస్‌ కెప్టెన్‌), సీవీ మిలింద్, తన్మయ్‌ అగర్వాల్, రోహిత్‌ రాయుడు, తనయ్‌ త్యాగరాజన్, అనికేత్‌ రెడ్డి, కన్నాల నితేశ్, అభిరత్‌ రెడ్డి, హిమతేజ, రాహుల్‌ రాధేశ్, రక్షణ్‌ రెడ్డి, కార్తికేయ కక్, శరణు నిశాంత్, ధీరజ్‌ గౌడ్‌.

స్టాండ్‌ బైస్‌: బుద్ధి రాహుల్, వరుణ్‌ గౌడ్, రిషబ్‌ బస్లాస్, భగత్‌ వర్మ, అజయ్‌దేవ్‌ గౌడ్‌. హెడ్‌ కోచ్‌: వినీత్‌ సక్సేనా. అసిస్టెంట్‌ కోచ్‌: ఎస్‌ఎన్‌ అమీత్, ఫీల్డింగ్, స్ట్రెంత్‌ అండ్‌ కండీషనింగ్‌ కోచ్‌: అర్జున్‌ హోయ్‌సాలా. ఫిజియో: సవ్యసాచి. వీడియో ఎనలిస్ట్‌: కృష్ణా రెడి. మసాజర్‌: సయ్యద్‌ సాజిద్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement