అక్టోబర్ 11 నుంచి రంజీ ట్రోఫీ
దేశవాళీ సీజన్ను ప్రకటించిన బీసీసీఐ
ముంబై: భారత దేశవాళీ క్రికెట్కు సంబంధించి 2026–27 సీజన్ షెడ్యూల్ను బీసీసీఐ ప్రకటించింది. ఆగస్టు 23 నుంచి జరిగే దులీప్ ట్రోఫీ టోర్నీతో సీజన్ మొదలవుతుంది. జోనల్ ఫార్మాట్లో జరగనున్న ఈ టోర్నీలో అన్ని మ్యాచ్లు బెంగళూరులో జరుగుతాయి. ప్రస్తుత రంజీ చాంపియన్ జమ్ము కశ్మీర్, రెస్టాఫ్ ఇండియా జట్ల మధ్య నిర్వహించే ఇరానీ కప్ మ్యాచ్ ఆ తర్వాత అక్టోబర్ 1 నుంచి 5 వరకు శ్రీనగర్లో జరుగుతుంది. అనంతరం ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ సుదీర్ఘ సీజన్ ప్రారంభం కానుంది.
అక్టోబర్ 11 నుంచి మార్చి 3 వరకు రంజీ మ్యాచ్లు నిర్వహిస్తారు. వన్డే టోర్నీ విజయ్హజారే ట్రోఫీని డిసెంబర్ 14 నుంచి జనవరి 8 వరకు...టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీని నవంబర్ 14 నుంచి డిసెంబర్ 6 వరకు నిర్వహిస్తారు. పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి అండర్–15, అండర్–16, అండర్–19, అండర్–23, సీనియర్ కేటగిరీల్లో సీజన్ మొత్తం కలిపి బీసీసీఐ ఏకంగా 1788 అధికారిక మ్యాచ్లు నిర్వహించనుండటం విశేషం.


