చెక్‌పోస్టులో ఏసీబీ సోదాలు | - | Sakshi
Sakshi News home page

చెక్‌పోస్టులో ఏసీబీ సోదాలు

Oct 20 2025 9:30 AM | Updated on Oct 20 2025 9:30 AM

చెక్‌పోస్టులో ఏసీబీ సోదాలు

చెక్‌పోస్టులో ఏసీబీ సోదాలు

రూ. 42,300 నగదు స్వాధీనం

రికార్డులను సీజ్‌ చేసి

తీసుకెళ్లిన అధికారులు

జహీరాబాద్‌: మొగుడంపల్లి మండలం మాడ్గి గ్రామ శివారులోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద ఆదివారం తెల్లవారు జామున ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా ఏసీబీ, డీఎస్‌పీ సుదర్శన్‌ ఆధ్వర్యంలో సిబ్బందితో తనిఖీల్లో పాల్గొన్నారు. శనివారం అర్ధరాత్రి దాటాక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సరిహద్దు రవాణ శాఖ చెక్‌పోస్టుల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. జహీరాబాద్‌ సమీపంలోని 65వ జాతీయ రహదారిపై గల చెక్‌పోస్టులో సోదాలు చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ తనిఖీల్లో రూ. 42,300 నగదు దొరికిందని వివరించారు. ఇందుకు సంబంధించి ఏ ఎంవీఐ కిరణ్‌కుమార్‌ సరైన సమాధానం చెప్పకపోవడంతో నగదు, రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement