
ఆదరణను చూసి ఓర్వలేకే..
నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం
మాట్లాడుతున్న కలెక్టర్ మిక్కిలినేని
సిద్దిపేటరూరల్: నకిలీ విత్తనాలు, ఎరువుల సరఫరా జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో వ్యవసాయ, పోలీసు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రుతుపవనాలు ముందస్తుగా రావడంతో రైతులు సాగుపై దృష్టి సారించారన్నారు. ఎక్కువ దిగుబడి ఆశను చూపూతూ దళారులు, వ్యాపారులు నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టే ప్రయ త్నం చేస్తారని, ఆ విధంగా జరగకుండా జిల్లాలో టాస్క్ఫోర్సు కమిటీలు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల స్థాయి టాస్క్ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. అవసరమైతే ఆకస్మిక తనిఖీలను నిర్వహించాలని ఆదేశించారు. మండల స్థాయిలో డీలర్లతో సమావేశాలు నిర్వహించాలని, లైసెన్సు డీలర్ల వద్దే విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలోకి బయటి నుంచి విత్తనాలు, ఎరువులు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాధిక, ఏడిఏలు, పొలీస్ అధికారులు పాల్గొన్నారు.
4న హుస్నాబాద్లో కిసాన్మేళా
హుస్నాబాద్లో జూన్ 4వ తేదీ నుంచి కిసాన్ మేళా జరుగుతుందని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అన్నారు. ఇందుకు పకడ్బందీ ఏర్పాట్లను చేయాలన్నారు. గురువారం కలెక్టరేట్లో కిసాన్ మేళా ఏర్పాట్లపై సమీక్షించారు. మేళాలో దాదాపు 130 స్టాల్స్ వరకు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి విభాగాన్ని పర్యవేక్షిస్తూ రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంటుందని, అధికారులను బృందాలుగా నియమించనున్నట్లు తెలిపారు. నూతన వ్యవసాయ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం గురించి అన్ని మండలాల రైతులు కార్యక్రమానికి హాజరయ్యే విధంగా చూడాలని, అవసరమైతే బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. భోజనం, తాగునీటి ఏర్పాట్లు చేయాలని, మార్కెట్ కమిటీలో శానిటేషన్ పనులు చేపట్టడంతో పాటు విద్యుత్ అంతరాయం లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
చేర్యాల(సిద్దిపేట): తెలంగాణలో ప్రజా పాలన నడుస్తోందని, ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. గురువారం చేర్యాల, మద్దూ రు, కొమురవెళ్లి, దూల్మిట్ట మండలాల్లోని గ్రా మాలకు చెందిన పలువురికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డితో కలిసి పంపిణీ చేశాడు. ఈ సందర్భంగా ఎంపీ చామల మాట్లా డుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్నింటిని నెరవేరుస్తామని చెప్పారు. కార్యక్రమంలో యువజన నాయకుడు కొమ్మూరి ప్రశాంత్రెడ్డి, నాయకులు జీవన్రెడ్డి, ఆగంరెడ్డి, మల్లేశం, రవి, శ్రీనివాస్, శ్రీకాంత్, మల్లేశం పాల్గొన్నారు.
తెలంగాణ జాతిపితగా కొండాను ప్రకటించాలి
ప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతిపితగా కొండా లక్ష్మణ్ బాపూజీని ప్రకటించాలని ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు జ్ఞానేశ్వర్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని మార్కండేయ ఆలయంలో నిర్వహించిన పద్మశాలి సమాజ సమావేశానికి పాల్గొన్నారు. అనంతరం బాపూజీ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ..జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని లక్ష్మణ్ బాపూజీ విగ్రహాల వద్ద జాతీయ జెండాలను ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా అధ్యక్షులు డాక్టర్ సతీష్ మాట్లాడుతూ..బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. బాపూజీ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలో ప్రచురించాలన్నారు. కార్యక్రమంలో పద్మశాలి సమాజం జిల్లా నాయకులు ముదిగొండ శ్రీనివాస్, కాముని రాజేశం, బాలరాజు, ప్రసాద్, భిక్షపతి, శ్రీహరి, గుండు రవితేజ, నాగరాజు, శ్రీనివాస్, జలజ, సునీత, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
టాస్క్ఫోర్స్ కమిటీల ఏర్పాటు
అవసరమైతే ఆకస్మిక తనిఖీలు
కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి
విపక్షాల దుష్ప్రచారంపై ఎంపీ చామల ధ్వజం
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
ఆకునూరులో భవనం ప్రారంభం
మండల పరిధిలోని ఆకునూరులో నిర్మించిన యాదవ సంఘం భవనాన్ని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి ఎంపీ చామల ప్రారంభించారు. అలాగే కురుమ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గిరి కొండల్రెడ్డి పాల్గొన్నారు.

ఆదరణను చూసి ఓర్వలేకే..