
సాదాబైనామాలకూ పరిష్కారం
● కలెక్టర్ మనుచౌదరి
● గజ్వేల్లో భూభారతిపై అవగాహన సదస్సు
గజ్వేల్: పెండింగ్లో ఉన్న సాదాబైనామా సమస్యలను పరిష్కరించడానికి ‘భూభారతి’లో అవకాశం కల్పించినట్లు కలెక్టర్ మనుచౌదరి తెలిపారు. సోమవారం గజ్వేల్లోని ఐఓసీ(ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్)లో నిర్వహించిన ‘భూభారతి’ అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల్లో అవగాహనను పెంపొందించడమే లక్ష్యంగా సదస్సుల నిర్వహణతోపాటు కరపత్రాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. భూసమస్యలపై అందించే దరఖాస్తులను భూభారతి చట్టం ద్వారా పరిష్కరిస్తామన్నారు. ఆర్డీఓ నిర్ణయంపై కలెక్టర్ వద్దకు, కలెక్టర్ నిర్ణయంపై భూ ట్రిబ్యునల్ వద్ద అప్పీల్ చేసుకోవచ్చునని తెలిపారు. అప్పీల్ వ్యవస్థ అందించిన తీర్పుపై సంతృప్తి చెందకపోతే సివిల్ కోర్టుకు వెళ్లవచ్చునని తెలిపారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులను తయారు చేసి, ప్రతి ఏటా ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. గ్రామాల్లో రెనెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడానికి గ్రామ పరిపాలన అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రకళ, మండల ప్రత్యేకాధికారి సువర్ణ, తహశీల్ధార్ శ్రావన్కుమార్, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.