
‘ఆపరేషన్ కగార్’ను నిలిపివేయండి
గజ్వేల్: భారత దేశంలోని ఖనిజ సంపదను కార్పొరేట్ల పరం చేయడానికి కేంద్రం చేపట్టిన శ్రీఆపరేషన్ కగార్శ్రీను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం గజ్వేల్లో ఉపాధ్యాయ, ఉద్యోగ, ప్రజా సంఘాల నేతృత్వంలో పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. శ్రీఆపరేషన్ కగార్శ్రీవల్ల జరుగుతున్న నష్టాలను పోస్టుకార్డులో వివరిస్తూ సుప్రీం కోర్టు న్యాయమూర్తికి పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయా సంఘాల నేతలు మాట్లాడుతూ అడవులను, అందులోని విలువైన ఖనిజ సంపదను కాపాడుతున్న ఆదివాసీ ప్రజలు నక్సలైట్లకు అండగా నిలుస్తున్నారని సాకుగా చూపి వారిని ఏరివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వందల సంవత్సరాలుగా ఏర్పాటు చేసుకున్న ఆదివాసీ, అటవీ రక్షణ చట్టాలకు తిలోదకాలిస్తూ..అడవులను ఖాళీ చేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామికవాదులు, ప్రకృతి ప్రేమికులను కేంద్ర ప్రభుత్వ చర్యలను గట్టిగా ప్రతిఘటించాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. ఇందులోభాగంగానే తాము దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి పోస్టుకార్డుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఏ.రాంచంద్రం, గజ్వేల్ జోన్ కన్వీనర్ జే.శ్రీనివాస్, ఆ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గజ్వేల్లో ఉపాధ్యాయ, ప్రజా సంఘాల పోస్టుకార్డు ఉద్యమం
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి
పంపిన నాయకులు