● ట్రాన్స్ ప్లాంటేషన్
జిల్లాలో నిజాంపేట నుంచి బీదర్ వరకు జాతీయ రహదారిని విస్తరిస్తున్నారు. నారాయణఖేడ్ మీదుగా వెళ్లే ఈ దారి పొడవునా వందల సంఖ్యలో అటవీశాఖకు చెందిన దశాబ్దాల కాలం నాటి చెట్లున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అటవీశాఖ అధికారుల సూచనల మేరకు రహదారుల నిర్మాణ సంస్థ వారు వీటిని నరికివేయకుండా మరోచోట నాటేవిధంగా వేర్లతో సహా తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వేర్ల చుట్టూ మట్టి రాలిపోకుండా గోనె సంచులను కట్టారు. త్వరలోనే వీటిని మరోచోట నాటనున్నారు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి


