బస్సులో మరిచిపోయిన ఆభరణాలు | - | Sakshi
Sakshi News home page

బస్సులో మరిచిపోయిన ఆభరణాలు

Dec 11 2025 9:56 AM | Updated on Dec 11 2025 9:56 AM

బస్సులో మరిచిపోయిన ఆభరణాలు

బస్సులో మరిచిపోయిన ఆభరణాలు

ప్రయాణికురాలికి అందజేసిన ఆర్టీసీ సిబ్బంది

ప్రయాణికురాలికి అందజేసిన ఆర్టీసీ సిబ్బంది

కోహెడరూరల్‌(హుస్నాబాద్‌): ఆర్టీసీ బస్సులో మరిచిపోయిన బంగారు పుస్తెలతాడును డ్రైవర్‌, కండక్టర్‌ బుధవారం బాధితురాలికి అందజేసి ఔదార్యం చాటుకున్నారు. వివరాలు ఇలా... హుస్నాబాద్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మంగళవారం కోహెడ మీదుగా కరీంనగర్‌కు వెళ్తుంది. ఈ ట్రిప్పులో బస్సులో డ్రైవర్‌ ఉల్లి చంద్రమౌళి, కండక్టర్‌ కరుణ ఒక చిన్నపాటి పెట్టెను గమనించారు. దాన్ని తెరిచి చూడగా అందులో సుమారు రెండు తులాల బంగారు పుస్తెలతాడు కనిపించింది. దీంతో సదరు నగలను ఆర్టీసీ డిపో మేనేజర్‌ బి.వెంకటేశ్వర్‌కు అప్పగించారు. ఈ మార్గంలో ప్రయాణించిన వారిని విచారించగా వింపల్లికి చెందిన బద్దం లక్ష్మికి చెందిన ఆభరణాలని తెలిసింది. దీంతో బుధవారం వారిని హుస్నాబాద్‌ డిపోకు రప్పించి.. అధికారుల సమక్షంలో ఆభరణాలు అప్పగించారు. పోయిన సొమ్మును భద్రంగా ప్రయాణికురాలికి అప్పగించిన కండక్టర్‌, డ్రైవర్‌ను పలువురు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement