కాంగ్రెస్తోనే అభివృద్ధి
నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డి
హత్నూర(సంగారెడ్డి): కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. మంగళవారం హత్నూర, బోరపట్ల ,నస్తీపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచా రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామాలు అభి వృద్ధికి నోచుకోలేవని, ప్రస్తుతం ప్రభుత్వ పాలనలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నాయ ని తెలిపారు. పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజల సంక్షేమానికి, అభివృద్ధి కోసం పని చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు.


