రాజ్యాంగంతోనే ప్రతి పౌరుడికి హక్కులు
సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రతి భారతీయుడికి రాజ్యాంగం అనేక విశిష్ట హక్కులను కల్పించిందని, సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పల ప్రసాద్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం పక్షోత్సవాల సందర్భంగా సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో ‘భారత రాజ్యాంగం–విలువలు’ పుస్తకాన్ని ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా అప్పల ప్రసాద్ మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని 15, 16, 17 ఆర్టికల్స్ సమానత్వం, సోదరభావం, న్యాయం వంటి ప్రాథమిక హక్కులను అందిస్తున్నాయన్నారు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర వ్యాప్తంగా కుల, మత విభేదాలు లేని సమాజ నిర్మాణం, ముఖ్యంగా సంచారజాతుల హక్కుల రక్షణకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. సంచార జాతుల్లో కొన్ని కులాల పేర్లు ఇంకా ప్రభుత్వ రికార్డుల్లో లేవని, వాటిని సర్కారు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అరవింద్ కుమార్ రమేశ్, మనోహర్, సంతోష్, మల్లారెడ్డి, విజయ భాస్కర్, శ్రీకాంత్, శ్రీనివాస్, ప్రభుదాస్ పాల్గొన్నారు.


