అదృశ్యమై.. శవమై.. | - | Sakshi
Sakshi News home page

అదృశ్యమై.. శవమై..

Dec 6 2025 9:24 AM | Updated on Dec 6 2025 9:24 AM

అదృశ్యమై.. శవమై..

అదృశ్యమై.. శవమై..

అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి

వెల్దుర్తి(తూప్రాన్‌): ఇంటి నుంచి బయటకు వెళ్లిన వివాహిత అనుమానాస్పదస్థితిలో శవమై కనిపించింది. ఈ ఘటన మండలంలోని మెల్లూర్‌ పంచాయతీ పరిధి పెద్దాపూర్‌ గ్రామ శివారులో చోటు చేసుకుంది. బాధిత కుటుంబసభ్యుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన దాసరి నర్సమ్మ(38) సత్తయ్యలు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. ఇంట్లో జరిగిన గొడవలతో ఈ నెల 3న ఉదయం నర్సమ్మ బయటకు వెళ్లింది. రెండు రోజులైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికి శుక్రవారం మిస్సింగ్‌ కేసు పెట్టారు. ఈ క్రమంలో సాయంత్రం గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో పశువులకాపర్లు మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు చెప్పారు. కాగా మృతురాలు నర్సమ్మగా గుర్తించారు. మృతురాలి మెడకు తాడు బిగించి ఉండటంతో హత్యకు గురికావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తిపై మృతురాలి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. సంఘటనా స్థలాన్ని తూప్రాన్‌ సీఐ రంగాకృష్ణ, వెల్దుర్తి ఎస్‌ఐ రాజు పరిశీలించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement