ఛట్‌ పూజ ఉపవాస దీక్షల ముగింపు | - | Sakshi
Sakshi News home page

ఛట్‌ పూజ ఉపవాస దీక్షల ముగింపు

Oct 29 2025 9:35 AM | Updated on Oct 29 2025 9:35 AM

ఛట్‌ పూజ ఉపవాస దీక్షల ముగింపు

ఛట్‌ పూజ ఉపవాస దీక్షల ముగింపు

వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎస్పీ దంపతులు

వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎస్పీ దంపతులు

పటాన్‌చెరు: ఉత్తర భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో సూర్య భగవానుడిని ఆరాధిస్తూ నిర్వహించుకునే ఛట్‌ పూజ ఉపవాస దీక్షల ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిపాల్గొన్నారు. సోమవారం సాయంత్రం పటాన్‌చెరు పట్టణంలోని సాకి చెరువు కట్టపై సూర్యాస్తమయం నుంచి ఉపవాస దీక్షలతో ప్రారంభమైన ఛట్‌ పూజ కార్యక్రమాలు మంగళవారం ఉదయం సూర్యోదయంతో సూర్య భగవానుడుని ఆరాధిస్తూ ఘనంగా ముగిశాయి. మంగళవారం తెల్లవారు జామున జరిగిన ముగింపు కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌ దంపతులతో కలిసి ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భగవంతుడి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement