
యాత్ర దానం విశేషాలివీ..
● యాత్ర దానం పేర బస్సును అద్దెకు తీసుకునేందుకు 55 సీట్లకు సంబంధించిన చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.
● అనాథ చిన్నారులు, పాఠశాల విద్యార్థులు, వృద్ధులు, దివ్యాంగులను ఈ ప్యాకేజీ కింద వారు కోరిన చోటుకు వెళ్లిరావచ్చు.
● దాతలు ప్రయాణికులెవరినీ సూచించని పక్షంలో ఆర్టీసీయే ఆ బాధ్యత తీసుకుంటుంది.
● ఎవరైనా దేవస్థానాలకు వెళ్లాలనే ఆలోచన ఉంటే అధికారులను సంప్రదించి యాత్ర దానం ద్వారా వెళ్లే బస్సుల్లో ఖాళీ ఉంటే వినియోగించుకోవచ్చు.
● కార్యక్రమం ద్వారా ఆర్టీసీకి ఆదాయం రావడంతోపాటు దాతలకు సామాజిక సేవ చేశామనే సంతృప్తి మిగులుతుంది.
● స్వచ్చంద సంస్థలు, దాతలు ఒకేసారి ఎక్కువమందిని ఈ సౌకర్యంతో తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.