
అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లు, జేసీబీ పట్టివేత
కొండపాక(గజ్వేల్): అక్రమంగా మట్టి తరలిస్తున్న మూడు టిప్పర్లు, ఒక జేసీబీనీ పట్టుకొని డ్రైవర్లపై కేసు నమోదు చేశారు. కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్ వివరాల ప్రకారం... రామచంద్రాపూర్ గ్రామ శివారులో మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్కు నీరు వెళ్లేందుకు కాలువ తవ్వకం పనులు జరిగాయి. ఇందులో వచ్చిన మట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు అక్రమార్కులు గజ్వేల్, కుకునూరుపల్లి పరిసర ప్రాంతాల్లో వెలుస్తున్న వెంచర్లు, ఇతరత్ర పనుల కోసం టిప్పర్లలో తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఏఎస్సై జగదీశ్వర్తో పాటు కానిస్టేబుళ్లు రాజేష్,సంతోష్లతో వెళ్లి జేసీబీతో పాటు 3 టిప్పర్లను పట్టుకొని పోలీస్టేషన్కు తరలించారు. ఏఎస్సై ఫిర్యాదు మేరకు డ్రైవర్లు దేశెట్టి అశోక్,తురి కై లాస్,బోదాస్ మల్లేష్లతో పాటు జేసీబీ డ్రైవరు బాబుపై కేసు నమోదు చేశారు.