దైవ దర్శనానికి వెళ్లొస్తూ అనంతలోకాలకు.. | - | Sakshi
Sakshi News home page

దైవ దర్శనానికి వెళ్లొస్తూ అనంతలోకాలకు..

May 31 2025 6:58 AM | Updated on May 31 2025 6:58 AM

దైవ ద

దైవ దర్శనానికి వెళ్లొస్తూ అనంతలోకాలకు..

కొమురవెల్లి(సిద్దిపేట): దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. మరోక యువకుడు గాయపడిన ఘటన మండలంలోని కిష్టంపేట గ్రామ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజు వివరాల ప్రకారం... నంగునూరు మండలం పాలమాకుల గ్రామానికి చెందిన రంగు రాహుల్‌(19) ఇటివలే ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. అతనికి బావ వరుసైన శీలే అజయ్‌ పుట్టినరోజు కావడంతో శుక్రవారం కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకుందామని ఉదయం ఇంటి నుంచి స్కూటీపై రాహుల్‌, అజయ్‌ బయలు దేరారు. స్వామి వారిని దర్శించుకున్నారు. తిరిగి వస్తున్న క్రమంలో కిష్టంపేట గ్రామ శివారులో చేర్యాల నుంచి కొమురవెల్లి వైపునకు వెళ్తున్న అశోకా లీలాండ్‌ వాహనంను ఎదురుగా ఢీకొట్టారు. రాహుల్‌ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. గాయపడిన అజయ్‌ను సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

గుర్తు తెలియని కారు ఢీకొని చిన్నారి..

బెజ్జంకి(సిద్దిపేట): రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలు కాగా వారి కుమారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బెజ్జంకి ఎస్‌హెచ్‌ఓ, ఏఎస్‌ఐ శంకర్‌రావు కథనం ప్రకారం... కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలంలోని నవాబుపేట గ్రామానికి చెందిన గూల్ల శ్రీకాంత్‌ భార్య కల్యాణి, కుమారుడు రక్షిత్‌(7)లతో కలిసి ద్విచక్ర వాహనంపై బెజ్జంకిలోకి బంధువు ఇంటికి వచ్చారు. తిరిగి స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో బెజ్జంకి క్రాసింగ్‌ సమీపంలో గల రాజీవ్‌ రహదారిపై హైద్రాబాద్‌ నుంచి వస్తున్న గుర్తు తెలియని నల్ల రంగు కారు అతి వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. రక్షిత్‌ రోడ్డుపై డివైడర్‌కు తగిలి తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీకాంత్‌, కల్యాణిలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానికులు అంబులెన్స్‌లో కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

అజాగ్ర త్తగా ద్విచక్ర వాహనం నడపడంతో..

నర్సాపూర్‌: అజాగ్రత్తగా ద్విచక్రవాహనాన్ని నడపడంతో జరిగిన ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. స్థానిక ఎస్‌ఐ లింగం కథనం ప్రకారం... చిలిపిచెడ్‌ మండలం చండూరుకు చెందిన రాంరెడ్డి తన భార్య మాధవి, తన కుమారుడు ధ్రువాన్స్‌ రెడ్డి(03)లను తన స్కూటీపై తీసుకొని శుక్రవారం ఉదయం మల్లంపేట వెళ్తున్నాడు. ఈ క్రమంలో నర్సాపూర్‌ పట్టణ శివారులో రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను స్కూటీ ఢీ కొట్టడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మాధవికి తీవ్ర గాయాలవ్వడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక వైద్యం చేసి హైద్రాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దైవ దర్శనానికి వెళ్లొస్తూ అనంతలోకాలకు..1
1/2

దైవ దర్శనానికి వెళ్లొస్తూ అనంతలోకాలకు..

దైవ దర్శనానికి వెళ్లొస్తూ అనంతలోకాలకు..2
2/2

దైవ దర్శనానికి వెళ్లొస్తూ అనంతలోకాలకు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement