
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో మెరిసిన గిరిపుత్రులు
హుస్నాబాద్రూరల్: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాల్లో హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డలోని గిరిజన గురుకుల కళాశాల విద్యార్థులు మెరిశారు. సోమవారం ప్రకటించిన ఈ ఫలితా ల్లో ఆల్ ఇండియా ఎస్టీ కేటగిరిలో బీ. సునీల్ 572 ర్యాంకు, ఎల్. ప్రవీణ్ 1,750 ర్యాంకు సా ధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ రాజు తెలిపారు.
మొగుడంపల్లి విద్యార్థి ప్రతిభ
జహీరాబాద్ టౌన్: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో మండల కేంద్రమైన మొగుడంపల్లి విద్యార్థి తుడం స్టాలిన్ ప్రతిభ కనబర్చాడు. ఆల్ ఇండియా ర్యాకింగ్లో 8,589 స్థానం సాధించగా జాతీయ స్థాయిలో ఎస్సీ కేటగిరీలో 205 ర్యాంక్ సాధించాడు. జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించడంతో తండ్రి సిరోమణి హర్షం వ్యక్తం చేశారు.
నాడు అనారోగ్యంతో
తల్లి.. నేడు తండ్రి
● ఇద్దరి మృతితో అనాథలుగా మారిన పిల్లలు
గజ్వేల్రూరల్: ఏడాది కిందట తల్లి, నేడు తండ్రి మృతి చెందడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. ఈ విషాదకర ఘటన గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీ(పల్లెపహాడ్)లో సోమవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన పల్లెపహాడ్కు చెందిన గూడూరి రమేశ్(40), పద్మ దంపతులకు 9 ఏళ్ల లోపు ఇద్దరు కుమారులు పవన్, వరుణ్లు ఉన్నారు. వీరి గ్రామం మల్లన్నసాగర్ ప్రాజెక్టులో ముంపునకు గురికావడంతో ప్రభుత్వం తాత్కాలికంగా కేటాయించిన డబుల్ బెడ్రూమ్లలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నారు. ఆర్అండ్ఆర్ కాలనీలో ఓపెన్ప్లాట్ను తీసుకొని ప్రభుత్వం ఇచ్చిన రూ. 5 లక్షల పరిహారంతో ఇంటి నిర్మాణం చేయాలనుకున్నారు. ఏడాది కిందట పద్మకు గుండెపోటు రావడంతో భర్త రమేశ్ ఆ రూ. 5 లక్షలతోపాటు మరికొంత డబ్బుతో వైద్యం చేయించినప్పటికీ మృతి చెందింది. భార్య మృతితో మానసికవేదనకు గురైన రమేశ్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించగా ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. తల్లిదండ్రులు ఇద్దరూ మృతి చెందడంతో ఆ చిన్నారులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు చందాలు వేసుకొని సోమవారం రమేశ్ అంత్యక్రియలను నిర్వహించారు. దాతలు ఎవరైనా ఉంటే పిల్లలను ఆదుకోవాలని 95029 56642 నంబరులో సంప్రదించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.
భార్యను చంపిన
కేసులో భర్త రిమాండ్
కొండపాక(గజ్వేల్): భార్యను కొట్టి చంపిన కేసులో భర్తను అరెస్టు చేసి పోలీసులు రిమాండ్కు తరలించారు. తొగుట సీఐ లతీఫ్ కుకునూరుపల్లి పోలీస్స్టేషన్లో సోమవారం కేసు వివరాలు వెల్లడించారు. కొండపాకకు చెందిన యశోదపై భర్త మల్లేశం అనుమానం పెంచుకొని గొడవపడి ఇనుప పారతో తలపై కొట్టాడు. ఆమె స్పృహ తప్పి పడిపోగా భయంతో పారిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యశోద ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే. మల్లేశం అదే రోజు రాత్రి హైదరాబాద్కు పారిపోయేందుకు కుకునూరుపల్లి బస్టాప్లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఎస్ఐ శ్రీనివాస్తోపాటు కలిసి అక్కడికి వెళ్లి నిందితుడు మల్లేశంను పట్టుకున్నట్లు సీఐ తెలిపారు. నేరం ఒప్పుకోగా రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు.

జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో మెరిసిన గిరిపుత్రులు

జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో మెరిసిన గిరిపుత్రులు

జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో మెరిసిన గిరిపుత్రులు

జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో మెరిసిన గిరిపుత్రులు