సమస్యలు దృష్టికి తీసుకురండి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు దృష్టికి తీసుకురండి

Jun 4 2025 8:49 AM | Updated on Jun 4 2025 4:38 PM

సమస్య

సమస్యలు దృష్టికి తీసుకురండి

రెవెన్యూ సదస్సులో కలెక్టర్‌ వల్లూరు క్రాంతి
బియ్యం కోసం బారులు

సంగారెడ్డి టౌన్‌/సంగారెడ్డి జోన్‌/ సంగారెడ్డి ఎడ్యుకేషన్‌ : నూతన రెవెన్యూ చట్టం భూ భారతి అమలులో భాగంగా జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రతీ చిన్న సమస్యను ఈ సదస్సుల్లో తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి సూచించారు. సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ ఖాన్‌పేట గ్రామంలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో టీజీఐఐసీ చైర్మన్‌ నిర్మలారెడ్డితో కలిసి పాల్గొన్నారు. అంతకుముందు మహిళలకు రుణాలపై కలెక్టరేట్‌లో బ్యాంకు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ క్రాంతి మాట్లాడుతూ...రైతులు ఏ చిన్న భూ సమస్యనైనా రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 20వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా మిగిలిన అన్ని మండలాల్లో ‘ప్రజల వద్దకే రెవెన్యూ నినాదం’తో సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 6 నుంచి 19 వరకు బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు సమస్యలు పరిష్కరిస్తారన్నారు. టీజీఐఐసీ చైర్మన్‌ నిర్మలారెడ్డి మాట్లాడుతూ..గతంలో ప్రభుత్వం తెచ్చిన ధరణితో రైతులు కార్యాలయాల చుట్టూ,కోర్టుల చుట్టూ తిరిగి ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన భూ భారతి రైతుల చుట్టమని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ రవీందర్‌రెడ్డి, మండల ప్రత్యేక అధికారి ఖాసీం బేగ్‌, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

సమస్యలు దృష్టికి తీసుకురండి1
1/2

సమస్యలు దృష్టికి తీసుకురండి

సమస్యలు దృష్టికి తీసుకురండి2
2/2

సమస్యలు దృష్టికి తీసుకురండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement