
వృత్తి వైద్యం.. ప్రవృత్తి చైతన్యం
సిద్దిపేటజోన్: ఆయన వృత్తి దంత వైద్యం.. ప్రవృత్తి మాత్రం పర్యావరణ పరిరక్షణకు కంకణం కట్టుకుని పట్టణ ప్రజలకు పరిచయమయ్యాడు డాక్టర్ డీఎన్ స్వామి. రసాయనిక ఎరువుల కూరగాయల వల్ల కలిగే అనర్థాల గూర్చి ప్రజల్లో అవగాహన కల్పించారు. స్వచ్ఛ బడిలో చెత్త పునర్వినియోగం, సేంద్రియ ఎరువుల తయారీ గూర్చి డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నారు. రసాయనిక ఎరువులు లేకుండా ఇంట్లో కూరగాయల పెంపకం గూర్చి చైతన్యపరిచారు. మిద్దె తోటల పెంపకం పేరిట అసోసియేషన్ ఏర్పాటు చేసి ఒక ప్లాట్ పామ్ ఏర్పాటు చేశారు.