
భవిష్యత్లో 2800 ఈవీ బస్సులు
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
జహీరాబాద్: భవిష్యత్లో కేంద్రం సహకారంతో 2800 పీఎం ఈవీ బస్సులు వస్తున్నాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బస్సులు రాగానే ప్రస్తుతం నడుస్తున్న 2500 బస్సులను ఓఆర్ఆర్ అవతలి వైపు ఉన్న గ్రామాలకు నడపుతామని పేర్కొన్నారు. గురువారం జహీరాబాద్లో ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్లో కాలుష్య నియంత్రణకు ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు నడుపుతామన్నారు. కాలుష్య నియంత్రణకు ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ తీసుకువచ్చామన్నారు. లాభాల బాటలో ఆర్టీసీ నడుస్తోందన్నారు. 150 బస్సులు మహిళా సంఘాలకు ఇచ్చామని తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించి పెండింగ్ బిల్లులు, డీఏ, పాత పీఎఫ్లతో సహా అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. అనంతరం ఆయన పల్లవి పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. సమావేశంలో ఎంపీ సురేష్ శెట్కార్, ఎమ్మెల్యే కె.మాణిక్రావు, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్.గిరిధర్రెడ్డి, పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎస్.ఉజ్వల్రెడ్డి, పార్లమెంట్ కార్యాలయ ఇన్చార్జి జి.శుక్లవర్ధన్రెడ్డి పాల్గొన్నారు.