
రామకృష్ణకు గ్రీన్ చాంపియన్ అవార్డు
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): మండలంలోని నిజాంపూర్(కే) ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ రాష్ట్ర స్థాయి గ్రీన్ చాంపియన్ అవార్డును అందుకున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో హైదరాబాద్లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ఆయన అవార్డును స్వీకరించారు. వనరుల సద్వినియోగం, పర్యావరణ పరిరక్షణ , పరిసరాల పరిశుభ్రత అంశాల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ సత్ఫలితాలు సాధించారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం రాష్ట్ర స్థాయి అవార్డును అందజేసింది. ఈ సందర్భంగా రామకృష్ణను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా సెక్టోరియల్ అధికారి వెంకటేశం, ఏఎంఓ బాలయ్య , జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి, మండల విద్యాధికారి శంకర్, నోడల్ అధికారి సుధాకర్ అభినందించారు.