అవయవదానం మరొకరికి ప్రాణదానం | - | Sakshi
Sakshi News home page

అవయవదానం మరొకరికి ప్రాణదానం

Jun 5 2025 8:12 AM | Updated on Jun 5 2025 8:12 AM

అవయవదానం  మరొకరికి ప్రాణదానం

అవయవదానం మరొకరికి ప్రాణదానం

జిన్నారం (పటాన్‌చెరు): మరో మనిషి ప్రాణాలను బతికించే అవయవదానం గొప్పది. ఈ నెల 1న సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ ఖాన్‌పేట్‌ గ్రామానికి చెందిన పార్థసారథి (37)అనే వ్యక్తి జిన్నారం మండలంలోని ఊట్ల గ్రామ శివారు రైస్‌మిల్‌ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై పడి ఉన్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వెంటనే అంబులెన్స్‌లో సురారంలోని మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో బ్రెయిన్‌డెడ్‌ అయి మృతి చెందినట్లు వెల్లడించారు. మరొకరి ప్రాణాలు కాపాడేందుకు భర్త అవయవాలు ఉపయోగపడతాయని తెలుసుకున్న భార్య మమత అయవయ దానానికి అంగీకరించింది. భర్త కళ్లు, గుండె, కిడ్నీలను దానం చేశారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులను ఆస్పత్రి యాజమాన్యం అభినందించింది. మృతుడి పార్థివదేహానికి సెల్యూట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement