మానవత్వం చాటిన ఆర్టీసీ ఉద్యోగులు | - | Sakshi
Sakshi News home page

మానవత్వం చాటిన ఆర్టీసీ ఉద్యోగులు

Jun 3 2025 7:02 AM | Updated on Jun 3 2025 7:02 AM

మానవత్వం చాటిన  ఆర్టీసీ ఉద్యోగులు

మానవత్వం చాటిన ఆర్టీసీ ఉద్యోగులు

జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌): బంగారు ఆభరణాలు, నగదును బస్సులో మర్చిపోయిన వ్యక్తికి ఆర్టీసీ ఉద్యోగులు అప్పగించి నిజాయితీ చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన బంటు యాదగిరి కూతురు పెళ్లికి సంబంధించి ఏడు తులా ల బంగారం, రూ.2.5 లక్షల నగదును బ్యాగులో పెట్టుకొని సోమవారం గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో భువనగిరి నుంచి యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం ఇంద్రానగర్‌కు బయలుదేరాడు. ఇంద్రానగర్‌ వెళ్లే ఆటో ఎక్కడానికి జగదేవ్‌పూర్‌ రాగానే బ్యాగును బస్సులోనే వదిలి హడావిడిగా దిగిపోయాడు. ఆ బ్యాగును గమనించిన డ్రైవర్‌ సలీం, కండక్టర్‌ ఓం ప్రకాశ్‌ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. కొద్దిసేపటికి యాదగిరి జగదేవ్‌పూర్‌కు వచ్చి పోలీస్‌స్టేషన్‌కు విషయాన్ని చెప్పాడు. ఎస్‌ఐ చంద్రమోహన్‌ బంగా రం, నగదు బ్యాగును బాధితుడికి అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement