
శిక్షణ.. ఉపాధి
కోర్సులు ఇవే...
సెట్విన్ కేంద్రంలో మహిళలకు కుట్టు శిక్షణ
హుస్నాబాద్: నగరాలు, పట్టణాలకే పరిమితమైన సెట్విన్ కేంద్రం మారుమూల పల్లెల్లోని మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు శిక్షణ తరగతులను ప్రారంభించింది. నిరుపేద యువత, మహిళలకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రోత్సహిస్తోంది. హుస్నాబాద్ పట్టణంలో దాదాపు ఏడాది క్రితం సెట్విన్ (సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ ప్రమోషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్) శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. శిక్షణ పొందడానికి కోర్సులను బట్టి రూ.600 నుంచి రూ.2100 ఫీజు వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 160 మంది వివిధ కోర్సుల్లో శిక్షణ పొంది స్వయం ఉపాధి పొందుతున్నారు. కోర్సులను బట్టి మూడు నెలల నుంచి ఏడాది వరకు డిప్లొమా కోర్సులపై శిక్షక్షణ ఇస్తున్నారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన అభ్యర్థులకు కేంద్రంలో శిక్షణ ఇస్తున్నారు.
ఫీజు చెల్లించలేని వారికి ఉచిత శిక్షణ
హుస్నాబాద్ నియోజకవర్గంలో సెట్విన్ ద్వారా ఫీజు కట్టలేని పేద, నిరుపేద, నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు స్వచ్ఛకర్మ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. ఏడాది కాలం ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి సెట్విన్తో ఫౌండేషన్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 2025–2026 సంవత్సరానికి నియోజకవర్గ యువత శిక్షణ ఖర్చులు భరించడానికి, స్వయం ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడానికి ఫౌండేషన్ తన వంతు సహాయం అందించనుంది. ఇందుకు గాను ఫౌండేషన్ రూ.4లక్షలు విరాళంగా ప్రకటించింది. ఏడాదిలో 160 మందికి శిక్షణ ఇవ్వడానికి ప్రతి త్రైమాసికంలో 40 మంది విద్యార్ధుల చొప్పున నాలుగు బ్యాచ్లలో శిక్షణ కోసం ఖర్చు చేయనుంది. శిక్షణ తరగతులతో మహిళలు ఆర్థిక స్వావలంబనకు అడుగులు వేస్తున్నారు. శిక్షణ పూర్తి చేసిన తర్వాత నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్లను అందజేయనున్నారు. తద్వారా జాబ్ మేళాలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.
సెట్విన్లో స్వయం ఉపాధి కోర్సులు
ఆర్థిక స్వావలంబన వైపు అడుగులు
ఫీజు కట్టలేని వారికి ఉచిత తర్ఫీదు
సెట్విన్తో స్వచ్ఛకర్మ ఫౌండేషన్
ఒప్పందం
నిరుపేద యువతీయువకులకు వరం
సెట్విన్ శిక్షణ కేంద్రంలో ఫ్యాషన్ డిజైన్ డిప్లొమా, బ్యూటిఫికేషన్, మగ్గం వర్క్స్, మెహందీ, స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఫ్రీ ప్రైమరీ టీచర్స్ ట్రైనింగ్, జూట్ బ్యాగుల తయారీ, ఎలక్ట్రికల్, ఎయిర్ కండీషన్ వంటి వివిధ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం బ్యాచ్ల వారీగా 105 మంది శిక్షణ పొందుతున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ పొందుతున్నారు. పట్టణానికి చెందిన మహిళలే కాకుండా వివిధ గ్రామాల నుంచి మహిళలు శిక్షణ పొందుతున్నారు. వివిధ కోర్సులకు సంబంధించి క్లాస్లతో పాటు ప్రాక్టికల్గా తర్ఫీదు ఇస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో మహిళలు కూడా శిక్షణ తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వివిధ కోర్సులకు గాను పట్టణాల్లో శిక్షణ తీసుకుంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అతి తక్కువ ఫీజుతో మహిళలు శిక్షణ పొందుతూ ఉపాధి పొందుతున్నారు.

శిక్షణ.. ఉపాధి

శిక్షణ.. ఉపాధి