
ప్రమాదాలను నివారించేందుకు చర్యలు
● బ్లాక్ స్పాట్స్ వద్ద
స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలి
● సిద్దిపేట కమిషనర్ అనురాధ
తొగుట(దుబ్బాక): రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు చర్యలు తీసుకోవాలని సిద్దిపేట కమిషనర్ అనురాధ పోలీసులను ఆదేశించారు. స్థానిక పోలీస్ స్టేషన్, సీఐ కార్యాలయాలను ఆమె శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన ప్రదేశాల్లో బ్లాక్ స్పాట్స్ వద్ద ఆర్అండ్బీ అధికారుల సమన్వయంతో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలన్నారు. స్టేషన్లో ఉన్న వాహనాల కేసులను పరిష్కరించి యజమానులకు అప్పగించాలని సూచించారు. అంతకుముందు పోలీస్ స్టేషన్, సీఐ కార్యాలయాల్లో రికార్డులు పరిశీలించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో గజ్వేల్ ఏసీపీ నర్సింహులు, సీఐ లతీఫ్, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్గౌడ్, తొగుట, రాయపోల్, కుకునూర్పల్లి, దౌల్తాబాద్ ఎస్ఐలు రవికాంత్రావు, రఘుపతి, శ్రీనివాస్, ప్రేమ్దీప్ పాల్గొన్నారు.