వెంటాడిన మృత్యువు | - | Sakshi
Sakshi News home page

వెంటాడిన మృత్యువు

May 30 2025 7:04 AM | Updated on May 30 2025 7:04 AM

వెంటాడిన మృత్యువు

వెంటాడిన మృత్యువు

● బాలుడిని చిదిమేసిన ట్రాక్టర్‌ రొటోవేటర్‌ ● మిరుదొడ్డి మండలం అల్వాలలో ఘటన

మిరుదొడ్డి (దుబ్బాక): విధి రాత ఎలా రాసి ఉంటుందో ఎవరికీ తెలియదు. తన వెంట పొలానికి వద్దని, ఇంటి దగ్గరే ఉండాలని తండ్రి వారించినా వినకుండా వెళ్లిన ఓ బాలుడు మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన మిరుదొడ్డి మండల పరిధిలోని అల్వాల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన బీడ కనకయ్య, లావణ్య దంపతులకు ఇద్దరు కుమారులు. గురువారం ఉదయం తండ్రి కనకయ్య పొలానికి వెళ్తుండగా చిన్న కొడుకు నికాస్‌ (5) తాను వస్తానని మారాం చేయడంతో తీసుకెళ్లాడు. తండ్రి ట్రాక్టర్‌ రొటోవేటర్‌తో పొలాన్ని దున్ను తున్న క్రమంలో నికాస్‌ను ఇంజిన్‌పై కూర్చోబెట్టుకున్నాడు. ప్రమాదవశాత్తు అతను జారి రొటోవేట ర్‌లో పడిపోయాడు. గమనించిన తండ్రి కనకయ్య అప్రమత్తమయ్యేలోపే ఘోరం జరిగిపోయింది. ప్రమాదంలో నికాస్‌ ముఖం నుజ్జునుజు కాగా, ఎడమ కాలు పూర్తిగా తెగిపోయి వేరైంది. అచేతన స్థితిలో ఉన్న కొడుకు మృతదేహాన్ని పట్టుకొని తల్లిదండ్రులు విలపించడం అక్కడున్న వారిని కలచివేశాయి. కాగా బాలుడి తండ్రికి వినికిడి లోపం ఉన్నట్టు తెలిసింది. బాలుడు రొటోవేటర్‌లో పడ్డాక చేసిన ఆర్తనాదాలు అతడికి వినపడకపోయి ఉండొచ్చని గ్రామస్తులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement