ఇద్దరు నిందితుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు నిందితుల అరెస్ట్‌

May 30 2025 7:04 AM | Updated on May 30 2025 7:04 AM

ఇద్దర

ఇద్దరు నిందితుల అరెస్ట్‌

నంగునూరు(సిద్దిపేట): రాత్రి పూట ఓ మహిళ ఇంట్లోకి చొరబడ్డ ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాజగోపాల్‌పేట ఎస్‌ఐ అసీఫ్‌, ట్రైనీ ఎస్‌ఐ సౌజన్య కథనం ప్రకారం.. పాలమాకుల గ్రామానికి చెందిన సంపంగి మహేశ్‌ తన స్నేహితుడు పల్లెపు సంపత్‌తో కలిసి బుధవారం రాత్రి ఓ మహిళ ఇంటికి వెళ్లారు. ఆమె గట్టిగా అరవడంతో చుట్టపక్కల వారు రావడంతో పారిపోయారు. సదరు మహిళ ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి బైక్‌ను స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపరిచారు.

గుర్తు తెలియని

మృతదేహం లభ్యం

సదాశివపేట రూరల్‌(సంగారెడ్డి): గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన మండలంలోని గొల్లగూడెం గ్రామ శివారులోని జాతీయ రహదారి 65 పక్కన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గురువారం ఉదయం స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రపరిచామని, వివరాలకు పోలీస్‌ స్టేషన్లో సంప్రదించాలని సీఐ మహేష్‌ గౌడ్‌ తెలిపారు.

తల్లి మందలించిందని యువకుడి ఆత్మహత్య

రామాయంపేట(మెదక్‌): తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని దామరచెరువు గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ బాల్‌రాజ్‌ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన గంగిరెడ్డి గణేశ్‌ (24) అపుడప్పడు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ ఎవరైనా కూలీ పనులకు పిలిస్తే వెళతాడు. ఇటీవల హైదరాబాద్‌ వెళ్లిన గణేశ్‌ తిరిగి స్వగ్రామానికి రాగా గురువారం అతడి తల్లి ఫోన్‌ చేసి నేను, తమ్ముడు పనిచేస్తుంటే జులాయిగా తిరుగుతున్నావని మందలించింది. ఏదైనా పని చూసుకోమని చెప్పింది. దీంతో మనస్తాపం చెందిన గణేశ్‌ తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు.

బాలికల చెవి కమ్మలు స్నాచింగ్‌

కౌడిపల్లి(నర్సాపూర్‌): ఆరుబయట ఆడుకుంటున్న బాలికల చెవి బంగారు కమ్మలు(పోగు లు) గుర్తు తెలియని మహిళ ఎత్తుకెళ్లింది. ఈ ఘటన మండల కేంద్రమైన కౌడిపల్లిలోని గొల్ల వాడలో గురువారం జరిగింది. ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రాజం శ్రీకాంత్‌ మనీషా దంపతుల పిల్లలు యక్షిత, సహస్ర వీరితోపాటు ఇరుగు పొరుగు పిల్లలు ఇంటిముందు ఆడుకుంటున్నారు. కుటుంబ సభ్యులు ఇంట్లో పనులు చేసుకుంటున్నారు. ఇంతలో అటుగా వచ్చిన మహిళ పిల్ల లతో మాట్లాడుతూ వారికి జామపండ్లు ఇచ్చి చెవికి ఉన్న బంగారు కమ్మలు (పోగులు) కత్తిరించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. పిల్లలు ఏడుస్తూ ఇంట్లోకి వచ్చి విషయం చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు బయటకు వచ్చిచూడగా ఎవరు కని పించలేదు. బంగారు కమ్మలు అర తులం ఉన్న ట్లు బాధితులు చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

లారీ దగ్ధం

జిన్నారం (పటాన్‌చెరు): ఇంటి ముందు ఉన్న లారీ దగ్ధమైంది. ఈ ఘటన బొల్లారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రవీందర్‌ రెడ్డి కథనం ప్రకారం... మున్సిపాలిటీ పరిధిలోని కేబీఆర్‌ కాలనీలోని నివాసముండే సంగమేశ్వర్‌ రోజులాగే తన లారీని ఇంటి ముందు బుధవారం రాత్రి నిలిపాడు. అర్ధరాత్రి సుమారు ఒంటి గంట సమయంలో లారీ నుంచి ఒక్కసారిగా చెలరేగిన మంటల్లో పూర్తిగా ఽకాలిపోయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇద్దరు నిందితుల అరెస్ట్‌ 1
1/2

ఇద్దరు నిందితుల అరెస్ట్‌

ఇద్దరు నిందితుల అరెస్ట్‌ 2
2/2

ఇద్దరు నిందితుల అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement