ఎంఆర్‌ఎఫ్‌ పరిశ్రమలో ‘కేపీఎస్‌’ విజయం | - | Sakshi
Sakshi News home page

ఎంఆర్‌ఎఫ్‌ పరిశ్రమలో ‘కేపీఎస్‌’ విజయం

May 29 2025 10:00 AM | Updated on May 29 2025 10:00 AM

ఎంఆర్‌ఎఫ్‌ పరిశ్రమలో  ‘కేపీఎస్‌’ విజయం

ఎంఆర్‌ఎఫ్‌ పరిశ్రమలో ‘కేపీఎస్‌’ విజయం

139 ఓట్ల తేడాతో సీఐటీయూపై గెలుపు

సదాశివపేట రూరల్‌(సంగారెడ్డి): మండలంలోని ఎంఆర్‌ఎఫ్‌ పరిశ్రమ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో కేపీఎస్‌(కార్మిక పోరాట సమితి) తమ ప్రత్యర్థి సంఘం సీఐటీయూపై 139 ఓట్ల తేడాతో విజయం సాధించింది. పరిశ్రమలో మొత్తం 1,603 ఓట్లు ఉండగా...1,577ఓట్లు పోలయ్యాయి. ఇందులో కేపీఎస్‌కు 584, సీఐటీయూకు 445, బీఎంఎస్‌కు 382, టీఎంటీడబ్ల్యూకు 164 ఓట్లు పడ్డాయి. రెండు ఓట్లు చెల్లుబాటు కాలేదు. ఈ సందర్భంగా కేపీఎస్‌ అధ్యక్షుడు కొత్తగొల్ల చంద్రశేఖర్‌ మాట్లాడారు. ఇది కార్మికుల విజయమని, పరిశ్రమలో కేపీఎస్‌ను మరోసారి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కార్మికుల సంక్షేమానికి,అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement