
తొలి ప్రయత్నంలోనే జడ్జిగా..
నంగునూరుకు చెందిన
మల్యాల సాహితీ ప్రతిభ
నంగునూరు(సిద్దిపేట): తెలంగాణ హైకోర్టు జడ్జి కోసం నిర్వహించిన వివిధ ప్రక్రియలో నంగునూరుకు చెందిన మల్యాల సాహితీ విజ యం సాధించింది. సిద్ది పేట జిల్లా నంగునూరుకు చెందిన మల్యాల అన్నపూర్ణ, రాజు పెద్ద కూతురు మల్యాల సా హితీ బెంగళూర్లోని రేవా యూనివర్సిటీలో లా విద్య పూర్తి చేసింది. తెలంగాణ హైకోర్ట్ జడ్జి నోటిఫికేషన్ విడుదల చేయడంతో దర ఖాస్తు చేసుకుంది. వివిధ దశల్లో జరిగిన ప్రక్రియలో విజయం సాధించడంతో తొలి ప్రయత్నంలోనే జడ్జిగా నియామకమైంది.
సాంస్క ృతిక పోటీల్లో
యువకుడి ప్రతిభ
కౌడిపల్లి(నర్సాపూర్): తెలంగాణ యువత ఆధ్వర్యంలో రిథమ్ డ్యాన్స్ అకాడమీ నిర్వహించిన రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీల్లో కౌడిపల్లి యువకుడికి సోలో డ్యాన్స్లో ప్రథమ బహుమతి లభించింది. 26, 27 తేదీల్లో కరీంనగర్ జమ్మికంటలో వివిధ విభాగాలలో రిథమ్ డ్యాన్స్ అకాడమీ పోటీలు నిర్వహించింది. ఇందులో కౌడిపల్లికి చెందిన సంధ్యగల్ల లోకేశ్ సోలో డ్యాన్స్ సీనియర్ విభాగంలో పోటీల్లో పాల్గొనగా ప్రథమ బహుమతి సాధించాడు. దీంతో జబర్దస్త్ ఆర్టిస్ట్ వెంకీతోపాటు నిర్వాహకుల నుంచి బహుమతి అందుకున్నట్లు లోకేశ్ తెలిపాడు. లోకేశ్ ప్రస్తుతం ట్రిపుల్ఈ డిప్లొమా పూర్తిచేశారు.
ఉత్తమ సేవలకు ఆర్టీసీ
ప్రగతి చక్రం పురస్కారాలు
జహీరాబాద్: ఉత్తమ సేవలందిస్తున్న ఆర్టీసీ సిబ్బందికి ప్రగతి చక్రం పురస్కారాలు అందజేశారు. బుధవారం స్థానిక బస్డిపో ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో డిపో మేనేజర్ జాకీర్ హుస్సేన్ క్యాష్ అవార్డులతోపాటు ప్రశంసా పత్రాలను అందించి సత్కరించారు. ప్రథమ బహుమతి కింద రూ.800, ద్వితీయ బహుమతి కింద రూ.600, తృతీయ బహుమతి కింద రూ.400 అందజేశారు. ఉద్యోగ విరమణ పొందుతున్న మొగులప్ప, వెంకన్న, వహీద్, ప్రమీలలకు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ ప్రవీణ్కుమార్, గ్యారేజీ ఇన్చార్జి తిరుమలేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
బసవేశ్వరుడి ఆశయ
సాధనకు కృషి చేయాలి
టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా రెడ్డి
సంగారెడ్డి జోన్: బసవేశ్వరుడి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా రెడ్డి సూచించారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో బసవేశ్వర 892వ జయంతి వేడుకలు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టీజీఐఐసీ చైర్పర్సన్తో పాటు అధికారులు లింగాయత్ సభ్యులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్మలారెడ్డి మాట్లాడుతూ సమాజ సేవకు అహర్నిశలు పాటుపడిన మహానీయుడని గుర్తు చేశారు. వీరశైవ లింగాయత్ భవన్ నిర్మాణం కోసం కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ పద్మజ రాణి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీశ్, జిల్లా లింగాయత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
చిన్నారిపై కుక్కల దాడి
అల్లాదుర్గం(మెదక్): మూడేళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలైన ఘటన అల్లాదుర్గంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. కుటుంబీకుల కథనం మేరకు.. అల్లాదుర్గానికి చెందిన మస్తాన్ భేరేషి కూతురు పాతీయ (3) ఇంటి ఎదుట ఆడుకుంటున్న తరుణంలో గుంపులుగా వచ్చిన కుక్కలు చిన్నారి పై దాడి చేశాయి. కుటుంబీకులు, కాలనీవాసులు వచ్చి కుక్కలను తరమివేశారు. అప్పటికే చిన్నారి తలపై, ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారిని జోగిపేట ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబీకులు తెలిపారు.

తొలి ప్రయత్నంలోనే జడ్జిగా..

తొలి ప్రయత్నంలోనే జడ్జిగా..

తొలి ప్రయత్నంలోనే జడ్జిగా..

తొలి ప్రయత్నంలోనే జడ్జిగా..