
ఉపాధిలో రాణిస్తున్నారు
● స్వయం ఉపాధిలో గ్రామీణ మహిళలు ముందంజ ● కొత్త సంఘాల ఏర్పాటుకుమహిళల ఆసక్తి ● జిల్లా టార్గెట్ రూ.927 కోట్లు రూ.911 కోట్లు మంజూరు
మునిపల్లి(అందోల్): గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా మహిళల స్వయం సహాయక బృందాలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తోంది. దీంతో మహిళలు కూడా స్వయం ఉపాధి కోసం వారే బాటలు వేసుకుంటున్నారు. చిరు వ్యాపారాల్లో ముందడుగు వేస్తున్నారు. ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు సాగుతూ తమ కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. జిల్లాలోని ఆయా గ్రామాల్లో మహిళలు స్వయం సహాయక సంఘాలలో చేరి ప్రభుత్వం ఇస్తున్న రుణాలతో ఉపాధి పొందుతూ లాభాలు ఆర్జిస్తున్నారు.
కొత్త సభ్యుల చేరిక...సంఘాల ఏర్పాటు
పొదుపు చేస్తూ ఆర్థిక సాధికారత సాధించేందుకు మహిళలు కొత్తగా స్వయం సహాయక సంఘాలలో చేరుతున్నారు. కొత్తగా చేరిన వారు వారి సంఘం తరఫున బ్యాంకు ఖాతాలను తెరిపించి రుణాలు కూడా అందిస్తున్నారు. మండలంలోని స్వయం సహాయక సంఘాలలోని మహిళా సభ్యులకు ప్రభుత్వం ప్రతీ సంవత్సరం బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు మంజూరు చేస్తోంది.
లక్ష్యం రూ.927కోట్ల రుణాలు
ఆయా సంఘాల సభ్యులు బ్యాంకుల్లో చేసుకున్న పొదుపు, తీసుకుంటున్న రుణాలను అనుసరించి 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు మొదటగా రూ.911 కోట్లను మంజూరు చేసింది. అందులోనే సీ్త్ర నిధి ద్వారా రూ.110 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతోనే మొత్తం రూ.927 కోట్లను ప్రభుత్వం లక్ష్యంగా ఇచ్చినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నాయి. ఇక బ్యాంకులో రుణాలు పొందిన లబ్ధిదారులు తిరిగి బ్యాంకులలో జమ చేస్తున్నారు.
గ్రామ సమైఖ్య సంఘాలు
స్వయం సహాయకసంఘాలు
సంఘంలో
సభ్యులు
రుణాల మంజూరు
లక్ష్యం
ఇప్పటి వరకుమంజూరైనవి
సీ్త్ర నిధి
ఎంతో ఉపయోగంగా ఉంది
డ్వాక్రా గ్రూపు సంఘంలో తీసుకున్న రుణంతో బుట్టలు, చాటలు అల్లుకుని వాటిపై వచ్చే డబ్బులతో కుటుంబం జీవనోపాధి పొందుతున్నాను. గ్రూపులలో చేరని వారంతా డ్వాక్రా గ్రూపులలో సభ్యత్వం తీసుకుని బ్యాంకు రుణాలతో కొంత వరకు ఉపాధి పొందడానికి అవకాశం ఉంది.
– మెదరి దుర్గారాణి
కొత్త సంఘాలు ఏర్పాటు..
కొత్తగా డ్వాక్రా గ్రూపు సంఘాలను ఏర్పాటు చేసి సంఘం సభ్యులకు రుణాలు మంజూరు చేస్తాం. రుణాలు పొందిన సభ్యులు వివిధ రకాల షాపులు, పని ముట్లు, కుట్టుమెషీన్లు, బట్టల వ్యాపారం ఇలా రక రకాల వ్యాపారాలు చేస్తూ తీసుకున్న రుణాలను తిరిగి బ్యాంకులలో జమ చేస్తున్నారు.
– జ్యోతి (డీఆర్డీఓ పీడీ)
●
695
1,98,154
రూ.911 కోట్లు

ఉపాధిలో రాణిస్తున్నారు

ఉపాధిలో రాణిస్తున్నారు