
ఎనిమిదేళ్లుగా రొట్టెల విక్రయం
మాది మాసాయిపేట మండలం, చెట్ల తిమ్మాయిపల్లి గ్రామం. నేను ఎనిమిదేళ్ల నుంచి తూప్రాన్ పట్టణంలో రోడ్డు పక్కన రోటీ సెంటర్ను నిర్వహించుకుంటున్న. రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రొట్టెలు చేసి అమ్ముతుంటా. కిలో పిండికి ఏడు నుంచి ఎనిమిది రొట్టెలు వస్తాయి. కిలోకు రూ.55 ఖర్చు అయితే ఒక్కో రొట్టె రూ.15 లెక్కనా రూ.105 నుంచి రూ.120 వరకు వస్తాయి. రోజుకు 60 రొట్టెల వరకు అమ్ముతా. ఖర్చులు పోగ రూ.500 రూ.600 వరకు ఆదాయం లభిస్తుంది.
– సునీత,
రొట్టెల తయారుదారు, తూప్రాన్
రోజు 2 రొట్టెలు తింటాను
ఆరోగ్యానికి జొన్న రొట్టెలు మంచివి. రోజు రాత్రి రెండు రొట్టెలు తింటాను. ఎంతో రుచిగా ఉంటాయి. ఇంట్లో రొట్టెలు తయారు చేసుకోలేని వారికి ఈ రోడ్డు సైడ్ జొన్న రొట్టె కేంద్రాలు ఉపయోగకరంగా ఉంటాయి. వ్యాయామంతోపాటు జొన్న రొట్టె ఆహారంగా తీసుకోవడంతోపాటు వాటిలో ఉండే పోషకాలు ఉండటం శ్రేయస్కరం.
– చెలిమిల బాబు, తూప్రాన్
నెలకు రూ.15 వేలు సంపాదిస్తున్న
ఐదేళ్లుగా తూప్రాన్లో నివాసం ఉంటున్నాను. ఆయుర్వేద ఆస్పత్రి ఎదుట తోపుడి బండి ఏర్పాటు చేసుకొని జొన్న రొట్టెలు విక్రయిస్తున్న. నిత్యం సుమారు 60 నుంచి 70 రొట్టెలు రూ.15 చొప్పున అమ్ముతాను. ఖర్చులు పోను రోజుకు రూ.500 వరకు కూలీ గిట్టుబాటు అవుతుంది. నెలకు ఖర్చులు పోను రూ.15 వేల నుంచి రూ.17 వేలకు వరకు మిగులుతాయి. కుటుంబానికి ఎంతో ఆసరాగా ఉంది.
– రుక్మీణి, రొట్టెల వ్యాపారి, తూప్రాన్
ఆహార నియంత్రణతోనే సాధ్యం
ఆహార నియంత్రణతోనే ఊబకాయం, మధుమేహం అదుపు చేసుకోవచ్చు. సమతుల ఆహారంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం, వాకింగ్ చేస్తే ఈ సమస్యలను అధిగమించొచ్చు. బయట లభించే జంక్ ఫుడ్, బేకరీ పదార్థాలు, చాట్ బండార్ పదార్థాలు, కూల్ డ్రింక్స్కు దూరంగా ఉండాలి. ఆహారంలో ఆకుకూరలు, కూరగాయాలు, పండ్లు ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. ఊబకాయం అంటే ఉండాల్సిన శరీర బరువు కంటే 20 శాతం ఎక్కువగా ఉండటం.
– డాక్టర్ అమర్సింగ్,
సీహెచ్సీ ఆస్పత్రి సూపరింటెండెంట్
●

ఎనిమిదేళ్లుగా రొట్టెల విక్రయం

ఎనిమిదేళ్లుగా రొట్టెల విక్రయం

ఎనిమిదేళ్లుగా రొట్టెల విక్రయం