
పాక్పై చర్యలు తీసుకోవాలి
పటాన్చెరు టౌన్: ఫహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై ముస్లిం సమాజం మండిపడింది. మతం పేరిట మారణహోమం సృష్టించినవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని వారంతా నినదించారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ పటాన్చెరు మండలం ఇస్నాపూర్లో శుక్రవారం ముస్లిం సోదరులు నిరసనలు చేపట్టారు. హిందూ ముస్లిం మతకలహాలను సృష్టించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న పాకిస్తాన్పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రత్యేక ప్రార్థనల సందర్భంగా ముస్లిం సోదరులు చేతికి నల్ల బ్యాడ్జీలు ధరించి నమాజులు చదివారు. ఉగ్రవాదంపై కేంద్రం తీసుకునే చర్యలకు ముస్లిం సమాజం వెన్నంటే ఉంటుందని మైనారిటీ నాయకులు మేరాజ్ ఖాన్, అబెద్, మునీరుద్దీన్, మీర్ ముహియుద్దీన్, నాసర్, కలీం పేర్కొన్నారు. కార్యక్రమంలో బాసిత్, ఇంతియాజ్, అన్వర్, మస్తాన్, అజీజ్, ఫైయజ్, గౌస్, నసీర్, సల్మాన్, సోఫీ, తదితరులు పాలొన్నారు.
ఇస్నాపూర్ చౌరస్తాలో ముస్లిం సోదరులు