పక్షం రోజుల్లో అందరికీ రైతుభరోసా | - | Sakshi
Sakshi News home page

పక్షం రోజుల్లో అందరికీ రైతుభరోసా

Apr 21 2025 1:04 PM | Updated on Apr 21 2025 1:04 PM

పక్షం రోజుల్లో అందరికీ రైతుభరోసా

పక్షం రోజుల్లో అందరికీ రైతుభరోసా

కంగ్టి(నారాయణఖేడ్‌): పక్షం రోజుల్లో రైతులందరికీ రైతు భరోసా అందజేస్తామని ఎంపీ సురేశ్‌ కుమార్‌ షెట్కార్‌ స్పష్టం చేశారు. కంగ్టి మండలంలోని తడ్కల్‌ రైతు వేదికలో కంగ్టి ప్యాక్స్‌ చైర్మన్‌ మారుతిరెడ్డి అధ్యక్షతన ఆదివారం జరిగిన జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఎనిమిదిన్నర లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. రూ. 2 లక్షల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ...తడ్కల్‌ మండలం ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామన్నారు. గతంలో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లిస్తే తడ్కల్‌లో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. రేషన్‌లో సన్నబియ్యం ఉచితంగా ఇస్తూన్నా నూకలు ఇచ్చారని సోషల్‌ మీడియాలో బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

జహీరాబాద్‌ ఎంపీ

సురేశ్‌ కుమార్‌ షెట్కార్‌

తడ్కల్‌ మండలం ఏర్పాటుకు

కట్టుబడి ఉన్నాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement