
అబ్దుల్ ఖాదర్ను విడుదల చేయండి
● హైకమిషన్ ఆఫ్ ఇండియాకు ఎంపీ రఘునందన్రావు వినతి ● 4 నెలలుగా మలేషియా జైలులోనే పోతారెడ్డిపేట వాసి
రావమ్మా.. మహాలక్ష్మి
దుబ్బాక: బతుకుదెరువు కోసం మలేషియా వెళ్లి తప్పుడు కేసులో అరెస్టు అయి జైలులో ఉన్న దుబ్బాక నియోజకవర్గంలోని భూంపల్లి–అక్బర్పేట మండలం పోతారెడ్డిపేటకు చెందిన అబ్దుల్ఖాదర్ను విడుదల చేయించాలని ఆదివారం కౌలాలంపూర్లోని హై కమిషన్ ఆఫ్ ఇండియాకు మెదక్ ఎంపీ రఘునందన్రావు విజ్ఞప్తి చేశారు. ఉపాధి కోసం 7 సంవత్సరాల క్రితం మలేషియాకు వెళ్లిన అబ్దుల్ఖాదర్ అక్కడ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం కంపెనీలో కొంత మంది వ్యక్తులతో గొడవ జరిగింది. దీంతో వ్యక్తిగత విభేదాల వల్ల ఆ కంపెనీ వారు అతడిపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేయించడంతో నాలుగు నెలలుగా జైలులో ఉన్నాడు. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితం మలేషియా పర్యటనకు వెళ్లిన ఎంపీ రఘునందన్రావు దృష్టికి అక్కడి తెలుగువాళ్లతో పాటు బాధిత కుటుంబీకులు తీసుకువచ్చారు. వెంటనే కౌలాలంపూర్లో ఉన్న హై కమిషన్ ఆఫ్ ఇండియాలో హై కమిషనర్ బీఎన్ రెడ్డిని కలిసి జరిగిన విషయంపై విన్నవించారు. తప్పుడు కేసులో అరెస్టు అయి జైలులో ఉన్న అబ్దుల్ ఖాదర్ను విడుదల చేయించి, స్వదేశానికి పంపించాలని ఎంపీ కోరడంతో పాటు వినతిపత్రం అందజేశారు.
మా తండ్రిని విడుదల చేసి ఇండియాకు పంపించండి: బాధితుడి కుమారులు
కాగా బతుకు దెరువు కోసం మలేషియాకు వెళ్లిన తమ తండ్రిని అరెస్టు చేయడం పట్ల పోతారెడ్డిపేటలోని అబ్దుల్ ఖాదర్ భార్యతో పాటు ముగ్గురు కుమారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ తండ్రిని విడుదల చేసి ఇండియాకు పంపించేందుకు చర్యలు తీసుకోవాలని బాధితుడి కుమారులు సల్మాన్, సోహైల్ భారత ప్రభుత్వాన్ని కోరారు.
నర్సాపూర్: ఆ ఇంట్లో ఆడపిల్ల పుట్టడంతో కుటుంబ సభ్యులు సంబురపడ్డారు. చిన్నారితో సహా తల్లి తమ ఇంటికి రాగానే పూలు చల్లుతూ స్వాగతం పలికారు. వివరాలిలా ఉన్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్కు చెందిన కరుణాకర్, స్పందన దంపతులకు 27 రోజుల కింద ఆడశిశువు జన్మించింది. ఇటీవల చిన్నారికి అమ్మమ్మ గారింట్లో తొట్టెల కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆదివారం కరుణాకర్ నర్సాపూర్లోని తమ ఇంటికి తీసుకొని వచ్చాడు. కుటుంబ సభ్యులు తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తూ పూలు చల్లుతూ స్వాగతం పలికి సంబురాలు చేసుకున్నారు.

అబ్దుల్ ఖాదర్ను విడుదల చేయండి