చెరువులో చేపపిల్లల మృత్యువాత
మెదక్జోన్: పట్టణానికి ఆనుకుని ఉన్న పిల్లికొటాల్ శివారులోని పిల్లికుంటలో అధిక సంఖ్యలో చేపపిల్లలు మృత్యువాతపడ్డాయి. 60మంది మత్స్యకారుల కుటుంబాలు ఈ చెరువుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. రెండు సంవత్సరాల క్రితం వదిలిన చేపపిల్లలు అరకిలో, గతేడాది ఆగస్టులో వదిలిన చేపపిల్లలు ఒక్కోటి 250 గ్రాముల వరకు పెరిగాయి. ఈ క్రమంలో మత్స్యకారులు చెరువులో నీరంతా ఎర్రగా మారడం, వేలాది చేపలు చనిపోతుతండడం గమనించారు. ఎవరో విషం కలపడం వల్లే చేపలు చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని సంబంధిత మత్స్యశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా విషం కలిసిందని దానికి విరుగుడు కోసం మందు కలపాలని మత్స్యకారులకు అందజేశారు. అయితే ఆ మందును చెరువులో కలిపినప్పటికీ ఎలాంటి లాభం లేకుండా పోయిందని వాపోయారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని మత్స్యకారులు వేడుకుంటున్నారు. అయితే సమీపంలో ఉన్న డబుల్బెడ్రూం ఇళ్ల నుంచి వచ్చే కలుషిత నీరు చెరువులో కలవడం వల్ల చేపలు చనిపోతున్నాయా? లేక ఎవరైనా విషం కలిపారా? అనే విషయం తెలియాల్సి ఉంది.
కలుషిత నీరా? విషం కలిపారా?
ఉపాధి పోయిందని
మత్స్యకారుల ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment