తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడిగా కప్పాటి | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడిగా కప్పాటి

Oct 4 2025 8:02 AM | Updated on Oct 4 2025 8:02 AM

తెలంగ

తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడిగా కప్పాటి

తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడిగా కప్పాటి కందుకూరు: తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడిగా మండలానికి చెందిన జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ కప్పాటి పాండురంగారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు అధ్యక్షురాలు కవిత శుక్రవారం నియామకపత్రం అందించారు. ఈ సందర్భంగా పాండురంగారెడ్డి మాట్లాడుతూ.. ఆత్మగౌరవంతో కూడిన తెలంగాణ కోసం పేదల పక్షాన నిలబడి పోరాటం చేస్తానని అన్నారు. తనను ఎన్నుకున్నందుకు కవితకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. జాతీయ సదస్సుకు షాద్‌నగర్‌ వాసికి ఆహ్వానం షాద్‌నగర్‌: తమిళనాడులోని సెంట్రల్‌ యూనివర్సిటీలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌ రీసెర్చ్‌ స్పాన్సర్‌షిప్‌తో ఈ నెల 9,10 తేదీల్లో జాతీయ స్థాయి కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్‌కు షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన అర్థశాస్త్ర అధ్యాపకుడు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సామ రవీందర్‌రెడ్డిని ఆహ్వానించారు. ‘క్‌లైమేట్‌ చేంజ్‌ అండ్‌ ఎనర్జీ ఫర్‌ వికసిత్‌ భారత్‌ 2047’ అంశంపై ప్రొఫెసర్లతో నిర్వహించే సదస్సుకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రొఫెసర్లు హాజరుకానున్నారు. వాతావరణంలో మార్పులతో దేశంలో ఆర్థిక వ్యవస్థ ఏవిధంగా ప్రభావితం అవుతుందనే అంశంపై ప్రసంగించనున్నట్లు డాక్టర్‌ సామ రవీందర్‌రెడ్డి తెలిపారు. గాంధీజీకి ఘన నివాళి ఆలయ ప్రధాన ద్వారం ప్రతిష్ఠలో పీసీసీ చీఫ్‌ ఉదావత్‌ లచ్చిరాంకు గ్లోబల్‌ పీస్‌ అవార్డు

మీర్‌పేట: అహింసా, సత్యాగ్రహం ద్వారా బ్రిటీష్‌ పాలన నుంచి దేశానికి స్వాతంత్య్రం సాధించడంలో మహాత్మాగాంధీ కీలకపాత్ర పోషించారని టీయూఎఫ్‌ఐడీసీ చైర్మన్‌ చల్లా నర్సింహారెడ్డి అన్నారు. జిల్లెలగూడ చందన చెరువు కట్టపై గురువారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వ ర్యంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయకులు చల్లా బాల్‌రెడ్డి, సిద్ధాల శ్రీశైలం, వెంకటేశ్‌గౌడ్‌, గజ్జెల రాంచందర్‌, ఓంప్రకాశ్‌, విజయవర్ధన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, పరశురాం పాల్గొన్నారు.

తుర్కయంజాల్‌: పురపాలక సంఘం పరిధి మునగనూర్‌లో నిర్మాణంలో ఉన్న వేంకటేశ్వర అభిషేక ఆనంద ఆలయం గర్భాలయం ప్రధాన ద్వారం ప్రతిష్ఠ కార్యక్రమానికి శుక్రవారం పీసీసీ చీఫ్‌ మహేశ్‌ మార్‌ గౌడ్‌ ఎమ్మెల్మే మల్‌రెడ్డి రంగారెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన ద్వారం గడప పూజ, కల్యాణ మహోత్సవం, పూర్ణాహుతిని వేద పండితులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్‌రెడ్డి రాంరెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చిలుక మధుసూదన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తుర్కయంజాల్‌: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని పురపాలక సంఘం పరిధి మునగనూర్‌కు చెందిన డా.ఉదావత్‌ లచ్చిరాంకు భారత్‌ బ్రాండ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ న్యూఢిల్లీ సీఈఓ డి.కె.రాజ్‌ శుక్రవారం ఆన్‌లైన్‌లో గ్లోబల్‌ పీస్‌ అవార్డ్‌–2025 అందజేశారు. ఈ సందర్భంగా లచ్చిరాం మాట్లాడుతూ.. పాఠశాల విద్యార్థులకు స్వాతంత్ర ఉద్యమం నాటి సంఘటనలు వివరించడం, కేంద్రం నిర్వహిస్తున్న క్విజ్‌ పోటీల్లో పాల్గొనేలా చేయడం, అహింసా మార్గాన్ని బోధించడంలో కృషి చేసినందుకు ఈ అవార్డు వరించిందని తెలిపారు.

తెలంగాణ జాగృతి జిల్లా        అధ్యక్షుడిగా కప్పాటి
1
1/3

తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడిగా కప్పాటి

తెలంగాణ జాగృతి జిల్లా        అధ్యక్షుడిగా కప్పాటి
2
2/3

తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడిగా కప్పాటి

తెలంగాణ జాగృతి జిల్లా        అధ్యక్షుడిగా కప్పాటి
3
3/3

తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడిగా కప్పాటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement