
ఇందిరమ్మ ఇళ్లలో పేదలకే ప్రాధాన్యం
మహేశ్వరం: ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హులైన, ఇల్లులేని పేదవారిని గుర్తించాలని రాష్ట్ర హౌసింగ్ బోర్డు స్పెషల్ సెక్రెటరీ వీపీ గౌతమ్ అన్నారు. మండల పరిధిలోని సిరిగిరిపురంలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. సర్వే, ఎంపిక పారదర్శకంగా సాగుతోందన్నారు. గూడు లేనివారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్, హౌసింగ్ పీడీ ధరావత్ చంప్లానాయక్, తహసీల్దార్ సైదులు, ఎంపీడీఓ శైలజ, తుక్కుగూడ మున్సిపల్ కమిషనర్ వాణి, పీఆర్ ఏఈ రామ్ప్రసాద్, ఆర్ఐ ప్రేమ్కుమార్, పంచాయతీ కార్యదర్శితదితరులు పాల్గొన్నారు.
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
తుక్కుగూడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర హౌసింగ్ బోర్డు స్పెషల్ సెక్రెటరీ గౌతమ్ సూచించారు. మంగళవారం మంఖాల్, తుక్కుగూడలో మున్సిపల్ అధికారులు చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పక్రియను హౌసింగ్ బోర్డు స్పెషల్ సెక్రెటరీ గౌతమ్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్తో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వాణి, మేనేజర్ పర్వతాలు, సీనియర్ అసిస్టెంట్ మల్లేశ్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర హౌసింగ్ బోర్డు స్పెషల్ సెక్రెటరీ వీపీ గౌతమ్