న్యూస్రీల్
బుధవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2026
పారదర్శకంగా
పోలీస్ ఓపెన్ హౌజ్లో ఏకే 47 గన్ను ఎక్కుపెట్టి పరిశీలిస్తున్న విప్
పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న విప్ ఆది శ్రీనివాస్
సిరిసిల్ల: ప్రజాపాలన పారదర్శకంగా.. జవాబుదారీతనంతో సాగుతుందని, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బి గితేతో కలిసి పోలీస్ గౌరవవందనం స్వీకరించిన విప్ జాతీయ జెండా ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాటల్లోనే..


