ఇల్లంతకుంట(సిరిసిల్ల): మండలకేంద్రంలోని హైస్కూల్కు చెందిన బయాలాజికల్ స్కూల్ అసిస్టెంట్ వుడుత మహేశ్ చంద్ర ఫిన్లాండ్ దేశంటీచర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంకు ఎంపికయ్యాడు. ఐదురోజుల పాటు ఫిన్లాండ్ దేశంలోని అనేక విద్యాసంస్థలను సందర్శించి ప్రముఖ యూనివర్సిటీలు, ఆధునిక పాఠశాలల్లో ప్రయోగాత్మక ఇన్నోవేటివ్ అప్రోచ్లు, స్టూడెంట్ సెంటర్ లెర్నింగ్ తదితర అంశాల్లో శిక్షణ పొందుతారు. చంద్రశేఖర్ను డీఈవో జగన్మోహన్రెడ్డి, సెక్టోరియల్ అధికారులు శైలజ, పద్మజ, జిల్లా సైన్స్ అధికారి పాముల దేవయ్య, హెచ్ఎం ప్రేమలత, ఉపాధ్యాయులు అభినందించారు.


