ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Jun 29 2025 3:02 AM | Updated on Jun 29 2025 3:02 AM

ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

రుద్రంగి(వేములవాడ): పేదల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. రుద్రంగిలోని గ్రామపంచాయతీ ఆవరణలో అర్హులైన నలుగురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌, 19 మంది లబ్ధిదారులకు రూ.6.66లక్షల విలువ సీఎమ్మార్‌ఎఫ్‌ చెక్కులను శనివారం పంపిణీ చేశారు. విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌, ఎరువులు, మేలైన వంగడాలను ప్రభుత్వం తరఫున అందిస్తున్నామన్నారు. రుద్రంగి ఏఎంసీ చైర్మన్‌ చెలుకల తిరుపతి, మాజీ జెడ్పీటీసి గట్ల మీనయ్య, మాజీ సర్పంచ్‌ తర్రె ప్రభలత, మాజీ ఉపసర్పంచ్‌ బైరి గంగమల్లయ్య, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు తర్రె మనోహర్‌, డీసీసీ కార్యదర్శులు గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, తర్రె లింగం, నాయకులు ఎర్రం గంగనర్సయ్య, పల్లి గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement